సెన్సార్ బోర్డు... అంతపని చేసిందా!
అన్ని అవాంతరాలు తొలగిపోయి ఇక శుక్రవారం థియేటర్లలోకి వెళ్లిపోతుంది కదా…అనుకున్న ఉడ్తా పంజాబ్ సినిమాకు అన్నింటికంటే మరింత పెద్ద షాక్ తగిలింది. ఈ చిత్రం పూర్తిగా టొరెంటో వెబ్సైట్లలో లీకయిపోయింది. సాధారణంగా సినిమా విడుదల అయ్యాక ఇలాంటి లీకులు జరుగుతాయి. కొన్నిసార్లు కొన్ని సీన్లు లీకవడం చూస్తుంటాం. కానీ సినిమా విడుదలకు ముందే, పూర్తి స్థాయిలో బయటకు రావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా యూనిట్ చెబుతున్న దానిబట్టి లీకైన కాపీలో ఎడమవైపున ఫర్ సెన్సార్ అని స్పష్టంగా […]
అన్ని అవాంతరాలు తొలగిపోయి ఇక శుక్రవారం థియేటర్లలోకి వెళ్లిపోతుంది కదా…అనుకున్న ఉడ్తా పంజాబ్ సినిమాకు అన్నింటికంటే మరింత పెద్ద షాక్ తగిలింది. ఈ చిత్రం పూర్తిగా టొరెంటో వెబ్సైట్లలో లీకయిపోయింది. సాధారణంగా సినిమా విడుదల అయ్యాక ఇలాంటి లీకులు జరుగుతాయి. కొన్నిసార్లు కొన్ని సీన్లు లీకవడం చూస్తుంటాం. కానీ సినిమా విడుదలకు ముందే, పూర్తి స్థాయిలో బయటకు రావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా యూనిట్ చెబుతున్న దానిబట్టి లీకైన కాపీలో ఎడమవైపున ఫర్ సెన్సార్ అని స్పష్టంగా కనబడుతున్నట్టుగా సమాచారం. సెన్సార్కోసం పంపే కాపీలోనే ఇలా ఉంటుంది. దాంతో సెన్సార్కి పంపిన కాపీయే బయటకు వచ్చిందా, సెన్సార్ బోర్డులో ఉన్నవారే ఈ పనిచేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
అది ఒకవేళ సెన్సార్ బోర్డు నుండే లీకయితే సిబిఎఫ్సి సిగ్గుపడాలని ఉడ్తా పంజాబ్ సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ పేర్కొనగా, తమనుండి అలాంటిదేమీ జరగలేదని, అవన్నీ వదంతులని సిబిఎఫ్సి ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ అన్నారు. ఇంటర్నెట్ నుండి ఉడ్తా పంజాబ్ సినిమాని డౌన్లోడ్ చేసుకుని చూడాలనుకునేవారు శనివారం వరకు వేచి ఉండాలని అనురాగ్ కశ్యప్ విజ్ఞప్తి చేశారు. తమ రెండేళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేయవద్దని ఆయన ఫేస్బుక్లో అభ్యర్థించారు. శనివారం తరువాతే ఇంటర్ నెట్లో చూడాలా, థియేటర్లో చూడాలా అనేదాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఇదిలా ఉండగా ఉడ్తా పంజాబ్ సినిమాని డివిడిలు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ముంబై సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అతడిని త్వరలో అరెస్టు చేయనున్నట్టుగా సమాచారం.