జీవితమే లేని వ్యక్తికి...జీవిత ఖైదు!
కోర్టుల్లో కేసులు తేలేసరికి జీవితాలే ముగిసిపోవటం సాధారణంగా జరుగుతున్నదే. ఉత్తర ప్రదేశ్కి చెందిన పుట్టి అనే వ్యక్తి విషయంలో కూడా అలాగే జరిగింది. 92ఏళ్ల వయసులో మంచంమీదున్న ఆ వృద్ధుడికి కోర్టు పరువు హత్య కేసులో జీవిత ఖైదుని విధించింది. 1980లో ఈ కేసు నమోదు కాగా తీర్పు వచ్చేసరికి ఇంతకాలం పట్టింది. ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితులు మరణించారు. పుట్టికి దిగువ కోర్టు జీవిత ఖైదుని విధించగా, అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచి […]
కోర్టుల్లో కేసులు తేలేసరికి జీవితాలే ముగిసిపోవటం సాధారణంగా జరుగుతున్నదే. ఉత్తర ప్రదేశ్కి చెందిన పుట్టి అనే వ్యక్తి విషయంలో కూడా అలాగే జరిగింది. 92ఏళ్ల వయసులో మంచంమీదున్న ఆ వృద్ధుడికి కోర్టు పరువు హత్య కేసులో జీవిత ఖైదుని విధించింది. 1980లో ఈ కేసు నమోదు కాగా తీర్పు వచ్చేసరికి ఇంతకాలం పట్టింది. ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు నిందితులు మరణించారు. పుట్టికి దిగువ కోర్టు జీవిత ఖైదుని విధించగా, అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచి దాన్ని సమర్ధిస్తూ ఆయన పోలీసుల ముందు లొంగిపోవాలని ఫిబ్రవరి 24న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాను అసలు లేవలేని స్థితిలో ఉన్నందున పోలీసుల ఎదుట హాజరుకాలేనంటూ పుట్టి సుప్రీంకోర్టుకి వెళ్లాడు. ఈ కేసుని పరిశీలించిన సుప్రీంకోర్టు, దిగువ కోర్టు విధించిన శిక్షని సమర్ధించడంతో, 92 ఏళ్ల వయసులో పుట్టి ఇప్పుడు జైలుకి వెళ్లనున్నాడు.