మద్యం మత్తు...కన్నకొడుకుని కడతేర్చింది!
మద్యపానం మనిషిని ఏస్థాయికి దిగజారుస్తుందో తెలిపే సంఘటనలు ఎప్పటికప్పుడు మన కళ్లముందుకు వస్తూనే ఉన్నాయి. చిత్తుగా తాగేసిన నాట్యశాల సత్యన్నారాయణ అనే వ్యక్తి ఇరవై రూపాయలు పోగొట్టాడని కన్నకొడుకుని చంపేశాడు. మెదక్ జిల్లా, సదాశివపేట, గొల్లగూడెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గురువారం రాత్రి కొడుకు నాగరాజు (8)కి రూ. 20 ఇచ్చి సరుకుల కోసం కిరాణాకొట్టుకి పంపాడు. ఎలా జరిగిందో కానీ, బాలుడి చేతిలోని రూ. 20 పోయాయి. ఈ విషయం తెలిసిన సత్యన్నారాయణ నాగరాజుని చితక […]
మద్యపానం మనిషిని ఏస్థాయికి దిగజారుస్తుందో తెలిపే సంఘటనలు ఎప్పటికప్పుడు మన కళ్లముందుకు వస్తూనే ఉన్నాయి. చిత్తుగా తాగేసిన నాట్యశాల సత్యన్నారాయణ అనే వ్యక్తి ఇరవై రూపాయలు పోగొట్టాడని కన్నకొడుకుని చంపేశాడు. మెదక్ జిల్లా, సదాశివపేట, గొల్లగూడెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గురువారం రాత్రి కొడుకు నాగరాజు (8)కి రూ. 20 ఇచ్చి సరుకుల కోసం కిరాణాకొట్టుకి పంపాడు. ఎలా జరిగిందో కానీ, బాలుడి చేతిలోని రూ. 20 పోయాయి. ఈ విషయం తెలిసిన సత్యన్నారాయణ నాగరాజుని చితక బాదాడు. నాగరాజు ఇంట్లోంచి బయటకు వెళ్లిపోగా, సత్యన్నారాయణ వెతికి ఇంటికి తెచ్చాడు . ఇంకా కోపం చల్లారని అతను, విచక్షణ కోల్పోయి కన్నకొడుకుని గొంతు నులిమి హత్య చేశాడు. సత్యన్నారాయణ హత్య తానే చేశానని ఒప్పుకోవటంతో పోలీసులు అతడిని శుక్రవారం అరెస్టు చేశారు.