మాల్యా...మంత్రాస్ ఫర్ సక్సెస్!
బ్యాంకు రుణాల ఎగవేత కేసులో విచారణ ఎదుర్కొంటూ, విదేశాల్లో ఉంటున్న పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా లండన్లో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రత్యక్ష్యమయ్యాడు. జర్నలిస్టు సన్నీ సేన్ తో కలిసి సుహేల్ సేథ్ రాసిన మంత్రాస్ ఫర్ సక్సెస్ అనే పుస్తకమది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత హై కమిషనర్ నవతేజ్ సర్నా అతిథిగా పాల్గొన్నారు. అయితే ఆహుతుల్లో కూర్చుని ఉన్న మాల్యాని చూడగానే ఆయన కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. […]
బ్యాంకు రుణాల ఎగవేత కేసులో విచారణ ఎదుర్కొంటూ, విదేశాల్లో ఉంటున్న పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా లండన్లో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రత్యక్ష్యమయ్యాడు. జర్నలిస్టు సన్నీ సేన్ తో కలిసి సుహేల్ సేథ్ రాసిన మంత్రాస్ ఫర్ సక్సెస్ అనే పుస్తకమది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత హై కమిషనర్ నవతేజ్ సర్నా అతిథిగా పాల్గొన్నారు. అయితే ఆహుతుల్లో కూర్చుని ఉన్న మాల్యాని చూడగానే ఆయన కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రేక్షకుల్లో మాల్యా కనిపించగానే సర్నా తీవ్రమైన అసహనానికి గురయినట్టుగా రచయిత సేథ్ తెలిపాడు.
తాము ఈ కార్యక్రమానికి ఎవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదని, ట్విట్టర్ ద్వారా అందరికీ ఆహ్వానం… ప్రకటన వెళ్లిందని సేథ్ వెల్లడించాడు. మాల్యాను ఈడి ప్రత్యేక న్యాయస్థానం ఉద్దేశపూరిత దోషిగా ప్రకటించడంతో పాటు ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు జారీ చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు… ఇంటర్నేషనల్ అరెస్టు వారెంటుగా పనిచేస్తుంది.