పరువు పోయిందని..కడుపుతో ఉన్న సోదరిని కాల్చి చంపేశాడు!
పాకిస్తాన్లో పరువు హత్యలు రానురాను ఎక్కువవుతున్నాయి. తమని కాదని పెళ్లి చేసుకున్నారన్న ఆగ్రహంతో కన్నవాళ్లు, సోదరులే ఆడపిల్లలను అత్యంత పాశవికంగా కడతేరుస్తున్నారు. పాక్, పంజాబ్ రాష్ట్రంలోని థిక్రీవాలా గ్రామానికి చెందిన షకీల్ తమ పక్క గ్రామానికి చెందిన ఆక్సా అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. ఆక్సా మరో నాలుగు రోజుల్లో ప్రసవించనున్న నిండు గర్భిణి. అయితే ఆమె ప్రేమ వివాహం చేసుకున్నదన్న కక్ష ఇంకా ఆ కుటుంబంలో అలాగే ఉంది. సౌదీ […]
పాకిస్తాన్లో పరువు హత్యలు రానురాను ఎక్కువవుతున్నాయి. తమని కాదని పెళ్లి చేసుకున్నారన్న ఆగ్రహంతో కన్నవాళ్లు, సోదరులే ఆడపిల్లలను అత్యంత పాశవికంగా కడతేరుస్తున్నారు. పాక్, పంజాబ్ రాష్ట్రంలోని థిక్రీవాలా గ్రామానికి చెందిన షకీల్ తమ పక్క గ్రామానికి చెందిన ఆక్సా అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. ఆక్సా మరో నాలుగు రోజుల్లో ప్రసవించనున్న నిండు గర్భిణి. అయితే ఆమె ప్రేమ వివాహం చేసుకున్నదన్న కక్ష ఇంకా ఆ కుటుంబంలో అలాగే ఉంది.
సౌదీ నుండి వచ్చిన ఆక్సా అన్న ఆదివారం చెల్లెలి ఇంటికి వెళ్లాడు. నిండుగర్భిణి అనే కనికరం కూడా లేకుండా ఆమెని తీవ్రంగా కొట్టాడు. ఆమెని, ఆమె భర్తని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకుని వెళ్లి తుపాకితో కాల్చిచంపాడు. పంజాబ్ రాష్ట్రలోనే జరిగిన మరో ఘటనలో క్రైస్తవ మతానికి చెందిన అమ్మాయి, ముస్లిం మతానికి చెందిన అబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లికోసం ఆ అమ్మాయి మతం మార్చుకున్నది. వీరి వివాహం మూడునెలల క్రితం అయ్యింది. అయితే క్షమించాం…ఇంటికి రమ్మంటూ ఆ యువతిని పిలిచిన తల్లిదండ్రులు, కూతురు ఇంటికి రాగానే కొట్టి చంపేశారు.