భార్య తిడుతోందని...రెండేళ్ల కూతురి ముందే చంపేశాడు!
మహారాష్ట్రలోని జాల్నాలో అశోక్ లఖన్లాల్ సురా (35) అనే వ్యక్తి, రెండేళ్ల కూతురు చూస్తుండగానే భార్య పూజ (25) ని కత్తితో పొడిచి చంపేశాడు. తరువాత పోలీస్ స్టేషన్కి వెళ్లి తన నేరాన్ని ఒప్పుకుని లొంగిపోయాడు. అతను చెప్పినది విని షాక్ తిన్నపోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్కి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న పూజని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయింది. ఆరేళ్ల క్రితం పెళ్లయిన ఈ జంటకి […]
మహారాష్ట్రలోని జాల్నాలో అశోక్ లఖన్లాల్ సురా (35) అనే వ్యక్తి, రెండేళ్ల కూతురు చూస్తుండగానే భార్య పూజ (25) ని కత్తితో పొడిచి చంపేశాడు. తరువాత పోలీస్ స్టేషన్కి వెళ్లి తన నేరాన్ని ఒప్పుకుని లొంగిపోయాడు. అతను చెప్పినది విని షాక్ తిన్నపోలీసులు వెంటనే పోలీస్ స్టేషన్కి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న పూజని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయింది.
ఆరేళ్ల క్రితం పెళ్లయిన ఈ జంటకి ఐదు, రెండు సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలున్నారు. పూజ చాలా చిన్న విషయాలకే తనతో గొడవ పడుతూ, ఎప్పుడూ తిడుతూ ఉండేదని, దాంతో ఇక భరించలేక ఈ పనిచేశానని అశోక్ పోలీసులకు వెల్లడించాడు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం అశోక్ కి పట్ణణంలో హోల్సేల్ కిరాణా దుకాణం ఉంది. దుకాణ నిర్వహణకు అశోక్ కుటుంబ సభ్యుల సహాయం తీసుకునేవాడు. అతను మద్యానికి బానిసగా మారి డీ అడిక్షన్ చికిత్స తీసుకుంటున్నాడు.
వీటన్నింటి కారణంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. క్రమంగా భార్యాభర్తల మధ్య విద్వేషాలు పెరిగిపోవటంతో అతను హత్యకు తెగించాడు. అశోక్ ఉంటున్నది ఉమ్మడి కుటుంబంలో. ఇంట్లోవారు భార్య కేకలు వినకుండా ఆమె నోట్లో బట్టని కుక్కాడు. టివి సౌండ్ని పెంచాడు. ఆమె ఇంకా ప్రతిఘటించగా గొంతుని బలంగా కోసి హత్య చేశాడు. హత్య అనంతరం అతను పోలీస్ స్టేషన్కి వెళ్లగా, రెండేళ్ల చిన్నారి తన నాన్నమ్మ వద్దకు వెళ్లి అమ్మకు రక్తం వస్తోందని చెప్పింది. ఆమె వచ్చి చూసి ఇతర కుటుంబ సభ్యులను పిలుస్తూ కేకలు వేసింది. ఈ లోపునే పోలీసులు వచ్చారు. పోలీసులు అశోక్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.