Telugu Global
NEWS

గండి బాబ్జీపై మరో కేసు... పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం

ఇటీవలే టీడీపీలో చేరిన గండిబాబ్జీపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వల్ల పార్టీ పరువుపోతోందని మండిపడుతున్నారు. తాజాగా గండిబాబ్జీపై మరో కేసునమోదైంది. ఆర్మీ ఉద్యోగి గురి సతీష్‌ కుటుంబానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో సబ్బవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సతీష్ కుటుంబసభ్యులు దేవుడమ్మ తన 20సెంట్ల స్థలంలో పంట సాగు చేశారు. ఆ స్థలంపై కన్నేసిన గండిబాబ్జీ తన సోదరుడు, అనుచరులతో కలిసి వచ్చి పంటను ధ్వంసం చేశారని […]

గండి బాబ్జీపై మరో కేసు... పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం
X

ఇటీవలే టీడీపీలో చేరిన గండిబాబ్జీపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వల్ల పార్టీ పరువుపోతోందని మండిపడుతున్నారు. తాజాగా గండిబాబ్జీపై మరో కేసునమోదైంది. ఆర్మీ ఉద్యోగి గురి సతీష్‌ కుటుంబానికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో సబ్బవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సతీష్ కుటుంబసభ్యులు దేవుడమ్మ తన 20సెంట్ల స్థలంలో పంట సాగు చేశారు. ఆ స్థలంపై కన్నేసిన గండిబాబ్జీ తన సోదరుడు, అనుచరులతో కలిసి వచ్చి పంటను ధ్వంసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమను దారుణంగా కొట్టారని కేసు పెట్టారు. దీంతో పలు సెక్షన్ల కింద గండి బాబ్జీ, ఆయన సోదరుడు, అనుచరులపై కేసు నమోదు చేశారు.

మరోవైపు గండి బాబ్జీతీరుపై జిల్లా టీడీపీలోని ఒక వర్గం తీవ్రంగా స్పందించింది. బాబ్జీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయని దాని వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని జిల్లా పార్టీకార్యదర్శి తమరాన బంగారు నాయుడు విమర్శించారు. తీరు మారకుంటే త్వరలోనే గండి బాబ్జీని పార్టీనుంచి సస్పెండ్ చేస్తామని ప్రకటించారు. మొగలిపురంలో భూములు కొనాలన్నా, అమ్మాలన్నా టీడీపీనేత గండి బాబ్జీ అనుమతి తప్పనిసరి అన్నట్టు వ్యవహారం నడుస్తోందని బంగారు నాయుడు అన్నారు.

Click on Image to Read:

jagan-case

ambati

tdp badvel incharge vijaya jyothi

pulla-rao

giddaluru-mla

gunta-srinivas

kodela

sakshi-signales

viveka-comments-on-nellore-

mla-raghurami-reddy

kodela

kodela-shiva-parasad

roja-letter

First Published:  21 Jun 2016 11:51 PM GMT
Next Story