నది బ్యారేజిపై సెల్ఫీ...ఏడు ప్రాణాలు నదిలోకి!
ఎన్నిప్రమాద సంఘటనలు వెలుగులోకి వస్తున్నా, వెర్రితలలు వేస్తున్న సెల్ఫీల మోజు తగ్గటం లేదు. ప్రమాదకరమైన పోజులతో సెల్ఫీలు దిగుతూ యువతీయువకులు ప్రాణాలనే కోల్పోతున్నారు. కుటుంబాలకు క్షోభ మిగులుస్తున్నారు. బుధవారం కాన్సూర్లో అలాంటి దుర్ఘటనే జరిగింది. కొంతమంది యువకులు కలిసి సెల్ఫీ దిగడానికి గంగానది వద్దకు వెళ్లారు. నది బ్యారేజిమీద నిలబడి సెల్ఫీలు తీసుకోవటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కాలుజారి ఒక యువకుడు నదిలో పడిపోయాడు. అతడు పడిపోవటం చూసిన స్నేహితులు, అతడిని కాపాడటానికి తాము కూడా నదిలోకి […]
ఎన్నిప్రమాద సంఘటనలు వెలుగులోకి వస్తున్నా, వెర్రితలలు వేస్తున్న సెల్ఫీల మోజు తగ్గటం లేదు. ప్రమాదకరమైన పోజులతో సెల్ఫీలు దిగుతూ యువతీయువకులు ప్రాణాలనే కోల్పోతున్నారు. కుటుంబాలకు క్షోభ మిగులుస్తున్నారు. బుధవారం కాన్సూర్లో అలాంటి దుర్ఘటనే జరిగింది. కొంతమంది యువకులు కలిసి సెల్ఫీ దిగడానికి గంగానది వద్దకు వెళ్లారు. నది బ్యారేజిమీద నిలబడి సెల్ఫీలు తీసుకోవటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కాలుజారి ఒక యువకుడు నదిలో పడిపోయాడు. అతడు పడిపోవటం చూసిన స్నేహితులు, అతడిని కాపాడటానికి తాము కూడా నదిలోకి దూకారు. ఎవరూ బయటకు రాలేకపోయారు. అలా ప్రమాదానికి గురయిన యువకునితో పాటు మొత్తం ఏడుగురు మృతి చెందారు.
వారితో పాటు వచ్చిన అరుణ్ అనే మరో యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. నదిలో గాలింపు నిర్వహించి ఆరు మృతదేహాలను వెలికితీశారు. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి దారుణాలు చూస్తుంటే ప్రమాదానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో సెల్ఫీలపై నిషేధాజ్ఞలను విధించి, ఆయా ప్రాంతాల్లో సెల్ఫీ తీసుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనబడుతోంది.