పిడుగుపడితే యురేనియం...సంపన్నులకు ఉచ్చు...150కోట్లు స్వాహా!
ఇంత తేలిగ్గా జనాలను మోసం చేయవచ్చా అనిపిస్తుంది…ఈ మోసగాడి కథ వింటే. పిడుగు పడుతున్నపుడు యురేనియం లభిస్తుందని, కోట్ల రూపాయిలు విలువచేసే యురేనియంని ఆ విధంగా తీసి ఇస్తానంటూ ఓ వ్యక్తి కోట్లు కొల్లగొట్టాడు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి కర్నూల్లో స్థిరపడ్డ కోహ్లీ అనే ఈ మోసగాడు తన మోసంతో దేశాన్నే చుట్టేశాడు. దేశవ్యాప్తంగా 150కోట్లు దోచేశాడు. ఇతడిని సిఐడి పోలీసులు బెంగలూరులో అరెస్టు చేశారు. బెంగలూరులో ఒక కార్పొరేట్ ఆఫీసుని తెరచి పెద్ద ఎత్తున […]
ఇంత తేలిగ్గా జనాలను మోసం చేయవచ్చా అనిపిస్తుంది…ఈ మోసగాడి కథ వింటే. పిడుగు పడుతున్నపుడు యురేనియం లభిస్తుందని, కోట్ల రూపాయిలు విలువచేసే యురేనియంని ఆ విధంగా తీసి ఇస్తానంటూ ఓ వ్యక్తి కోట్లు కొల్లగొట్టాడు. ఉత్తర భారతదేశం నుండి వచ్చి కర్నూల్లో స్థిరపడ్డ కోహ్లీ అనే ఈ మోసగాడు తన మోసంతో దేశాన్నే చుట్టేశాడు. దేశవ్యాప్తంగా 150కోట్లు దోచేశాడు. ఇతడిని సిఐడి పోలీసులు బెంగలూరులో అరెస్టు చేశారు. బెంగలూరులో ఒక కార్పొరేట్ ఆఫీసుని తెరచి పెద్ద ఎత్తున దందా మొదలుపెట్టిన ఈ యురేనియం బాబా కోటీశ్వరులను టార్గెట్ చేసేవాడు. ఒక్కసారి పిడుగుపడితే 300 కోట్ల యురేనియం లభిస్తుందని, దేశవ్యాప్తంగా ఎక్కడ పిడుగుపడినా తనకు శాస్త్రవేత్తలు ఫోన్ చేస్తారని, పిడుగుపడినపుడు లభించే పదార్థాలను తాను ప్రత్యేకమైన ల్యాబ్లో పరీక్షించాల్సి ఉంటుందని…ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చేప్పి నమ్మించేవాడు. పైగా ఈ వివరాలన్నింటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించేవాడు. తనవాటాగా మూడునుండి ఐదుకోట్లు తీసుకుంటానని చెబుతూ, ధనవంతులనుండి డబ్బు వసూలు చేసేవాడు.
అలా అతను 17 రాష్ట్రాల్లో 62మందిని మోసం చేసి దాదాపు 150 కోట్లు వారినుండి దోచుకున్నాడు. ఇందులో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది సంపన్నులు ఉన్నారు. అతను చెప్పిన గడువు ముగిసినా ఎలాంటి స్పందనా లేకపోవటంతో మోసపోయినట్టుగా అర్థం చేసుకున్న వారు పోలీసులను ఆశ్రయించారు. దాంతో సిఐడి రంగంలోకి దిగి కోహ్లీకోసం వలపన్ని బెంగలూరులోని ఒక విలాసవంతమైన హోటల్లో అరెస్టు చేసింది. అతనికోసం పదిరోజులు శ్రమించిన పోలీసులు చివరికి బాధితులకు అతను చేసిన ఫోన్ నెంబర్ల ఆధారంగా సిగ్నల్స్ని ట్రేస్ చేశారు. కోహ్లీని విచారణకోసం హైదరాబాద్కి తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కోహ్లీ గురించి పలు ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతను 11 ఫోన్లను వాడేవాడు. రాష్ట్రాలవారీగా సిమ్లు, ఫోన్లను మార్చేవాడు. ముగ్గురు పిఎలను, రక్షణకోసం బలిష్టమైన ముగ్గురు ప్రయివేటు బౌన్సర్లను నియమించుకున్నాడు. అతని బాధితుల్లో కర్ణాటకకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఒక సినీ ప్రముఖుడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలుగురాష్ట్రాల్లో సినీ పారిశ్రామిక రంగాలకు చెందిన నలుగురు, రాజకీయ రంగానికి చెందిన నలుగురి నుండి 65కోట్లు వసూలు చేశాడని, గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఓ సినీ హీరోకు యురేనియం ద్వారానే కలిసి వచ్చిందని వారికి మాయమాటలు చెప్పి నమ్మించాడని పోలీసులు అనుమానిస్తున్నారు.