వీడియో తీసి బ్లాక్ మెయిల్....ఎదిరించిందని నిర్భయ లాంటి హింస!
బీహార్లో మోతిహరి అనే గ్రామంలో నిర్భయ తరహాలో మరొక ఘోరం జరిగింది. 21ఏళ్ల యువతిని దుండగులు దారుణంగా హింసించారు. దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి రోడ్డుపక్క పడేసి వెళ్లిపోయారు. యువతి శరీరంలోకి తుపాకిని, కర్రలను చొప్పించి ఆమెని తీవ్రంగా గాయపరచారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణాన్ని స్థానిక మీడియా గురువారం వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి పేరు సమీయుల్లా అని స్థానిక మీడియా తెలిపింది. యువతిపై […]
బీహార్లో మోతిహరి అనే గ్రామంలో నిర్భయ తరహాలో మరొక ఘోరం జరిగింది. 21ఏళ్ల యువతిని దుండగులు దారుణంగా హింసించారు. దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి రోడ్డుపక్క పడేసి వెళ్లిపోయారు. యువతి శరీరంలోకి తుపాకిని, కర్రలను చొప్పించి ఆమెని తీవ్రంగా గాయపరచారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణాన్ని స్థానిక మీడియా గురువారం వెలుగులోకి తెచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి పేరు సమీయుల్లా అని స్థానిక మీడియా తెలిపింది.
యువతిపై గతంలో ఒకసారి అత్యాచారం చేసిన సమీయుల్లా, ఆ ఘటనని వీడియో తీశాడు. దాన్ని చూపించి యువతిని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇలాంటి సమయంలోనే ఒకసారి ఆమె అతడిని బ్లేడుతో గాయపరచింది. ఆ కక్షని మనసులో పెట్టుకున్న సమీయుల్లా తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆ టివి ఛానల్ తెలిపింది. బాధితురాలి శరీర గాయాలు నిర్భయ ఘటనని గుర్తు తెస్తున్నాయని పేర్కొంది. మోతిహరీ పోలీసులు కేసుని నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.