అమ్మానాన్న ఇంట్లో లేనపుడు...ఆమెపై అఘాయిత్యం!
తల్లిదండ్రులు 13ఏళ్ల బాలికని ఒంటరిగా వదిలి వేరే ఊరు వెళ్లటం…ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్, జైపూర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకున్నది. శనివారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం రాత్రి బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండటం గమనించిన ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి నిప్పంటించారు. అదే ఊరికి చెందిన విక్కీ, సోను, విజయ్ అనే ఆ ముగ్గురు దుర్మార్గులు బాలికను డాబామీదకు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.అక్కడితో ఆగకుండా శుక్రవారం ఉదయం […]
తల్లిదండ్రులు 13ఏళ్ల బాలికని ఒంటరిగా వదిలి వేరే ఊరు వెళ్లటం…ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్, జైపూర్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకున్నది. శనివారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం రాత్రి బాలిక ఒంటరిగా ఇంట్లో ఉండటం గమనించిన ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి నిప్పంటించారు. అదే ఊరికి చెందిన విక్కీ, సోను, విజయ్ అనే ఆ ముగ్గురు దుర్మార్గులు బాలికను డాబామీదకు తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.అక్కడితో ఆగకుండా శుక్రవారం ఉదయం బాధితురాలికి నిప్పంటించి పారిపోయారు. 75 శాతం కాలిన గాయాలతో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ముగ్గురిలో ఒకడైన విక్కీ(25)ని అరెస్టు చేసి మిగిలిన ఇద్దరికోసం గాలిస్తున్నారు.