రాజనీతి శాస్త్రం నుండి వంటలు నేర్చుకున్న...బీహార్ టాపర్ అరెస్టు!
బీహార్లో టాపర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో 12వ తరగతి ఆర్ట్స్ విభాగంలో అక్రమంగా టాపర్స్థానాన్ని పొందిన రూబీరాయ్ని పోలీసులు అరెస్టు చేశారు. రివ్యూ ప్యానల్ పరీక్షలో ఆమె ప్రాథమిక స్థాయి ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పలేకపోవటంతో ఆమె మోసపూరిత విధానంతో ర్యాంకుని సాధించినట్టుగా నిర్దారించారు. రూబీరాయ్ ఇంతకుముందు ఓ టివి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజనీతి శాస్త్రంనుండి వంటలు నేర్చుకున్నట్టుగా చెప్పింది. సైన్స్ టాపర్గా నిలిచిన మరొక విద్యార్థి నీళ్లకు హెచ్టుఓకి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా […]
బీహార్లో టాపర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో 12వ తరగతి ఆర్ట్స్ విభాగంలో అక్రమంగా టాపర్స్థానాన్ని పొందిన రూబీరాయ్ని పోలీసులు అరెస్టు చేశారు. రివ్యూ ప్యానల్ పరీక్షలో ఆమె ప్రాథమిక స్థాయి ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పలేకపోవటంతో ఆమె మోసపూరిత విధానంతో ర్యాంకుని సాధించినట్టుగా నిర్దారించారు. రూబీరాయ్ ఇంతకుముందు ఓ టివి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజనీతి శాస్త్రంనుండి వంటలు నేర్చుకున్నట్టుగా చెప్పింది. సైన్స్ టాపర్గా నిలిచిన మరొక విద్యార్థి నీళ్లకు హెచ్టుఓకి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చెప్పలేకపోయాడు. స్కూలు ఎగ్జామినేషన్ బోర్డు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటి శనివారం రూబీరాయ్ని కొన్ని ప్రశ్నలు అడిగి ఆమె సబ్జక్ట్ నాలెడ్జిని పరీక్షించింది. ఆమె సమాధానాలు చెప్పలేకపోవటంతో ఆమె పరీక్షా ఫలితాలను కమిటీ రద్దు చేసింది.
బీహార్ టాపర్స్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి బచ్చారాయ్ని పోలీసులు ఈ నెల మొదట్లోనే అరెస్టు చేశారు. అతను వైశాలి జిల్లాలోని బిషున్రాయ్ కాలేజికి కార్యదర్శిగా, ప్రిన్స్ పాల్గా పనిచేస్తున్నాడు. ఈ కాలేజికి చెందిన రూబీరాయ్, సౌరభ్ శ్రేష్ఠ ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో 12వ తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచారు. ఇంతకుముందు సౌరభ్ శ్రేష్ఠ విద్యావేత్తల కమిటీ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా, మళ్లీ పరీక్షలు నిర్వహిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన సంగతి తెలిసిందే. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విద్యార్థుల్లో ఇతను కూడా ఉన్నాడు.