45 లక్షలు బహుమతి వచ్చిందని మెసేజ్...ఆమె ప్రాణాలు తీసింది!
మోసగాళ్ల వలలో చిక్కుకుని 11 లక్షలు పోగొట్టుకున్న మహిళ చివరికి తన ప్రాణాలనే తీసుకుంది. బెంగలూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. పాలక్ వి (44) అనే మహిళకు ఇటీవల… మీరు 45 లక్షలు బహుమతి గెలుచుకున్నారు అంటూ ఒక మెసేజ్ వచ్చింది. తన పేరు ఆండ్రూగా చెప్పుకున్న మోసగాడు, డబ్బు మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపుతామని చెప్పాడు. అయితే అందుకు కస్టమ్స్ క్లియరెన్స్లాంటి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంటూ కొంత మొత్తాన్ని తనకు పంపాల్సిందిగా కోరాడు. […]
మోసగాళ్ల వలలో చిక్కుకుని 11 లక్షలు పోగొట్టుకున్న మహిళ చివరికి తన ప్రాణాలనే తీసుకుంది. బెంగలూరులో ఈ విషాదం చోటుచేసుకుంది. పాలక్ వి (44) అనే మహిళకు ఇటీవల… మీరు 45 లక్షలు బహుమతి గెలుచుకున్నారు అంటూ ఒక మెసేజ్ వచ్చింది. తన పేరు ఆండ్రూగా చెప్పుకున్న మోసగాడు, డబ్బు మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపుతామని చెప్పాడు. అయితే అందుకు కస్టమ్స్ క్లియరెన్స్లాంటి కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంటూ కొంత మొత్తాన్ని తనకు పంపాల్సిందిగా కోరాడు. ఆ మాటలు నమ్మిన పాలక్ జూన్ 6 నుండి 13వరకు పలుమార్లు నాలుగు బ్యాంకు ఎకౌంట్లకు డబ్బుని పంపింది. ఆమె డబ్బుని పంపుతుండటంతో మోసగాళ్లు ఇంకేవో కారణాలు చూపుతూ మరింత డబ్బుని డిమాండ్ చేసేవారు. అలా పాలక్ మొత్తం 11 లక్షల రూపాయలు మోసగాళ్లకు ముట్టచెప్పింది.
ఈ విషయం సీనియర్ ఐటి ప్రొఫెషనల్ అయిన భర్తకు గానీ, తన ఇద్దరు పిల్లలకు గానీ చెప్పలేదు. అంతేకాక మోసగాళ్లు ప్రయిజ్ మనీ కోసం ఢిల్లీకి రమ్మనటంతో అక్కడి వెళ్లింది. మాయగాళ్లు అక్కడ కూడా ఫోన్ ద్వారా మరింత డబ్బు కావాలని అడగ్గా తనవద్దలేదని చెప్పింది. దాంతో వారు తాము ప్రయిజ్ మనీ 45 లక్షలు ఇవ్వలేమని చెప్పటంతో… అప్పుడు అర్థమైంది పాలక్కి తాను మోసపోయానని.
ఇంటికి తిరిగివచ్చిన పాలక్, పురుగుమందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆమె పిల్లలు రక్షించడంతో ప్రాణాలతో బయటపడింది. జరిగింది కుటుంబ సభ్యులకు చెప్పింది. వారంతా ధైర్యం చెప్పి, పోలీస్లకు కంప్లయింట్ ఇద్దామని ఓదార్చారు. అయితే ఆ తరువాత రోజే కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పాలక్ బెడ్రూంలో చీరతో ఊరేసుకుని ప్రాణాలు విడిచింది.
ప్రస్తుతం ఈ కేసుని పోలీసులు విచారిస్తున్నారు. పాలక్ డబ్బు పంపిన బ్యాంకు అకౌంట్లపై ఆరా తీస్తున్నారు. ఆయా బ్యాంకుల నుండి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. మోసగాళ్లు బ్యాంకులకు ఇచ్చే సమాచారం అంతా తప్పుడుదే అయి ఉంటుందని, వారు మోసం పూర్తవగానే ఆ అంకౌంట్లను వినియోగించరని, ఆ చిరునామాల్లో ఉండరని, ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.