Telugu Global
Cinema & Entertainment

కశ్మీర్ లోయలో పనిపూర్తిచేసిన రామ్ చరణ్

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ అనే సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. త్వరలోనే మరో పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా కశ్మీర్ షెడ్యూల్ ను పూర్తిచేశాడు చరణ్. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి అక్కడ ఓ పాటను, కొన్ని సన్నివేశాల్ని పిక్చరైజ్ చేశారు. ఈ షెడ్యూల్ ముగించుకున్న సినిమా యూనిట్… హైదరాబాద్ చేరుకుంది. ఈ షెడ్యూల్ తర్వాత చెర్రీ నెక్ట్స్ చేయాల్సిన షెడ్యూల్ పై […]

కశ్మీర్ లోయలో పనిపూర్తిచేసిన రామ్ చరణ్
X

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ అనే సినిమా చేస్తున్నాడు చెర్రీ. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. త్వరలోనే మరో పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా కశ్మీర్ షెడ్యూల్ ను పూర్తిచేశాడు చరణ్. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి అక్కడ ఓ పాటను, కొన్ని సన్నివేశాల్ని పిక్చరైజ్ చేశారు. ఈ షెడ్యూల్ ముగించుకున్న సినిమా యూనిట్… హైదరాబాద్ చేరుకుంది. ఈ షెడ్యూల్ తర్వాత చెర్రీ నెక్ట్స్ చేయాల్సిన షెడ్యూల్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే… చెర్రీ తండ్రి మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. దీనికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నిర్మాణ వ్యవహారాల్ని చెర్రీ పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అందుకే కుదిరితే ధ్రువ సినిమాకు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి… కత్తిలాంటోడు సినిమా నిర్మాణ పనుల్ని చూసుకోవాలని చెర్రీ భావిస్తున్నాడు. అయితే చిరంజీవి మాత్రం చెర్రీని వారిస్తున్నాడట. ధ్రువ పనులు చూసుకోమని సలహా ఇస్తున్నాడట. మరి చెర్రీ తన సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభిస్తాడా…లేక చిరంజీవి 150వ సినిమా పనులు చూసుకుంటాడా అనేది త్వరలోనే తేలుతుంది. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం తన కాల్షీట్లు పొడిగించనని కరాఖండింగా చెప్పేసిందట. సో… చెర్రీ తన సినిమాకే తొలి ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలున్నాయి.

First Published:  29 Jun 2016 11:40 PM GMT
Next Story