అనుమానిస్తున్నాడని...భర్తని చంపిన మహిళ!
రాజస్థాన్లోని బరాన్జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భర్త తనని అనుమానిస్తూ, వేధించడాన్ని భరించలేకపోయిన ఒక భార్య అతడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న భగవతిదేవి, ఆమె భర్త రాజ్వీర్ తరచుగా గొడవలు పడుతుండేవారు. తన ఉద్యోగ రీత్యా మగవారితో మాట్లాడటం, కలిసి పనిచేయటం తప్పదని, కానీ రాజ్వీర్ తాను ఎవరితో మాట్లాడినా చెడుగానే చూసేవాడని, కొట్టేవాడని, తిట్టేవాడని భగవతి చెబుతోంది. హత్య జరిగిన బుధవారం రాత్రి కూడా ఇలాగే ఇద్దరి […]
రాజస్థాన్లోని బరాన్జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భర్త తనని అనుమానిస్తూ, వేధించడాన్ని భరించలేకపోయిన ఒక భార్య అతడిని కత్తితో పొడిచి హత్య చేసింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న భగవతిదేవి, ఆమె భర్త రాజ్వీర్ తరచుగా గొడవలు పడుతుండేవారు. తన ఉద్యోగ రీత్యా మగవారితో మాట్లాడటం, కలిసి పనిచేయటం తప్పదని, కానీ రాజ్వీర్ తాను ఎవరితో మాట్లాడినా చెడుగానే చూసేవాడని, కొట్టేవాడని, తిట్టేవాడని భగవతి చెబుతోంది.
హత్య జరిగిన బుధవారం రాత్రి కూడా ఇలాగే ఇద్దరి మధ్య తీవ్రమైన వాదన జరిగింది. ఈ క్రమంలో భగవతి దేవి కత్తితో రాజ్వీర్ని పొడిచి చంపేసింది. అతని కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే వారు అక్కడికి దగ్గరలోనే ఉన్న అతని సోదరుడికి సమాచారం అందించారు. రాజ్వీర్ అప్పటికే మృతి చెందాడు. పోలీసులు భగవతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె తాను చేసిన పనిపట్ల ఎలాంటి పశ్చాత్తాపాన్ని చూపలేదు. ఒకవేళతాను అతడిని చంపకపోతే, అతడే తనని చంపేసేవాడని ఆమె పోలీసులతో చెప్పింది.