కేజ్రీవాల్ పెట్టిన మంట అంటుకుంటోంది..!
మహారాష్ట్ర బీజేపీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ రోజు మహారాష్ట్ర బీజేపీలో కేజ్రీవాల్ రేపిన మంట క్రమంగా కార్చిచ్చులా మారే అవకాశాలు ఉన్నాయి. మాఫియా, దావూద్ ఇబ్రహీంతో తరచుగా ఫోన్లో మాట్లాడుతున్నాడంటూ కొన్ని ఆధారాలను ఆప్ అధినేత వెల్లడించడంతో ఆయనపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించారు. దీంతో తన మంత్రి పదవికి […]
BY sarvi1 July 2016 12:24 AM GMT
sarvi Updated On: 1 July 2016 5:20 AM GMT
మహారాష్ట్ర బీజేపీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ రోజు మహారాష్ట్ర బీజేపీలో కేజ్రీవాల్ రేపిన మంట క్రమంగా కార్చిచ్చులా మారే అవకాశాలు ఉన్నాయి. మాఫియా, దావూద్ ఇబ్రహీంతో తరచుగా ఫోన్లో మాట్లాడుతున్నాడంటూ కొన్ని ఆధారాలను ఆప్ అధినేత వెల్లడించడంతో ఆయనపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించారు. దీంతో తన మంత్రి పదవికి ఏక్నాథ్ ఖడ్సే రాజీనామా చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి విచారణకు కూడా ఆదేశించారు.
గురువారం ఏక్నాథ్ ఖడ్సే విలేకరుల సమావేశంలో పలు వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నోరు విప్పితే.. దేశం మొత్తం గజగజ వణుకుతుందన్నారు. మహారాష్ట్రలో పార్టీ విజయానికి తానెంతో కృషి చేశానని చెప్పాడు. శివసేనతో పొత్తు కూడా తన వల్లనే సాధ్యమైందని వెల్లడించాడు. ఇంతకీ ఏక్ నాథ్ ఖడ్సే నోరు విప్పితే ఏం జరుగుతుంది? ఆయన ఎవరికి హెచ్చరికలు పంపారు? అన్న ప్రశ్నలను ప్రతిపక్ష పార్టీలైన ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు లేవనెత్తుతున్నారు. ఆయనను వెంటనే జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అందరి కంటే ముందుగా ఈ విషయాన్ని వెల్లడించి.. కేజ్రీవాల్ సంచలనం ఊరికే పోలేదు. అది క్రమంగా పార్టీ నేతల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. మరి ఈ వివాదాన్ని ఏక్నాథ్ ఇంతటితో ఆపుతారా? లేకుంటే నిజంగా ఆయన నోరుతెరిచి లోకానికి తెలియని విషయాలు వెల్లడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story