భర్తకు విడాకులిచ్చింది...ప్రియుడు కాదన్నాడు...ఆత్మహత్య చేసుకుంది!
ప్రేమలు, ఇష్టంలేని పెళ్లిళ్లు, విడాకులు, ప్రేమించిన వాడితోనే బతకాలనే ఆశలు…ఇలాంటివి ఈమధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి మరో ఉదంతంలో ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఎన్టిపిసి పట్టణ శివారు గ్రామమైన జంగాలపల్లికి చెందిన బోర లావణ్య (26), శివరాత్రి రమేష్ (28) ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. అయితే లావణ్య తల్లిదండ్రులు ఆమెకు ఎన్టిపిసీలోని భీమునిపట్నం కాలనీకి చెందిన ఒక యువకునితో వివాహం చేశారు. ఆరేళ్ల క్రితం వీరి పెళ్లి కాగా, […]
ప్రేమలు, ఇష్టంలేని పెళ్లిళ్లు, విడాకులు, ప్రేమించిన వాడితోనే బతకాలనే ఆశలు…ఇలాంటివి ఈమధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి మరో ఉదంతంలో ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఎన్టిపిసి పట్టణ శివారు గ్రామమైన జంగాలపల్లికి చెందిన బోర లావణ్య (26), శివరాత్రి రమేష్ (28) ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పక్కపక్క ఇళ్లలో ఉండేవారు. అయితే లావణ్య తల్లిదండ్రులు ఆమెకు ఎన్టిపిసీలోని భీమునిపట్నం కాలనీకి చెందిన ఒక యువకునితో వివాహం చేశారు. ఆరేళ్ల క్రితం వీరి పెళ్లి కాగా, వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. అయితే ఇన్నేళ్లు గడిచినా లావణ్య రమేష్ని మర్చిపోలేకపోయింది. అతనితోనే జీవితం అనుకుంది.
ఈ క్రమంలో లావణ్య భర్త నుండి విడాకులు తీసుకుని ఆరునెలలుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆమె రమేష్మీద ఒత్తిడి తేవటం మొదలుపెట్టింది. కానీ రమేష్ లావణ్యని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. దాంతో మనస్తాపం చెందిన లావణ్య ఇంట్లో ఉన్న టి బి వైద్యానికి ఉపయోగించే మాత్రలను ఎక్కువ మొత్తంలో తీసుకుంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లావణ్యను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్, లావణ్య ఆత్మహత్యకు తనని బాధ్యుడిని చేస్తారేమో అనే భయంతో తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్పష్టతలేని ప్రేమ, అనాలోచిత నిర్ణయాలు, వాస్తవాలను అంగీకరించి బతకలేని బేలతనం ఇవన్నీ కలిసి లావణ్య జీవితాన్ని ముగించేశాయి. నాలుగేళ్ల చిన్నారిని తల్లిలేని పిల్లగా మిగిల్చాయి.