ఎంత ఖర్మ...ఇతనుకూడా తండ్రే!
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కొత్త బూట్లు కొనిస్తాను రమ్మనగానే ఆరేళ్ల చిన్నారి తండ్రి వెంట ఆనందంగా పరుగులు తీస్తూ వెళ్లింది. ఆమెకు తెలియదు.. అతను తన ప్రాణాలు తీయడానికి తీసుకువెళుతున్నాడని. కూతురిని చంపే ఉద్దేశ్యంతో ఆ తండ్రి ఆమెని వావిల్లి బ్రిడ్జి ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అతనితో పాటు ఘాతుకంలో పాలుపంచుకోవడానికి అతని స్నేహితుడు కూడా వచ్చాడు. ఇద్దరూ అల్హాస్ నదిలో పాపని విసిరేసి వెళ్లిపోయారు. ఇది బుధవారం రాత్రి జరగ్గా పాప […]
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. కొత్త బూట్లు కొనిస్తాను రమ్మనగానే ఆరేళ్ల చిన్నారి తండ్రి వెంట ఆనందంగా పరుగులు తీస్తూ వెళ్లింది. ఆమెకు తెలియదు.. అతను తన ప్రాణాలు తీయడానికి తీసుకువెళుతున్నాడని. కూతురిని చంపే ఉద్దేశ్యంతో ఆ తండ్రి ఆమెని వావిల్లి బ్రిడ్జి ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అతనితో పాటు ఘాతుకంలో పాలుపంచుకోవడానికి అతని స్నేహితుడు కూడా వచ్చాడు. ఇద్దరూ అల్హాస్ నదిలో పాపని విసిరేసి వెళ్లిపోయారు. ఇది బుధవారం రాత్రి జరగ్గా పాప పదకొండు గంటలపాటు చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని అలాగే ఉండిపోయింది.
గురువారం ఉదయం స్థానిక నిర్మాణ కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న రమేష్ బైర్ అనే వ్యక్తి బ్రిడ్జిమీద నడుచుకుంటూ వెళుతూ పాప ఏడుపు విని ఆగాడు. అతను జాగ్రత్తగా గమనించగా బ్రిడ్జి కింద చెట్ల కొమ్మల్లో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన అతను పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పాపని క్షేమంగా బయటకు తీశారు. చిన్నారిని భట్టి వర్తక నగర్కి చెందిన ఏక్తా తులసీరామ్ సియానీగా పోలీసులు గుర్తించారు. అంతకుముందు ఇదే ప్రాంత పోలీస్ స్టేషన్లో పాప తల్లి తన కూతురు కనిపించడం లేదని ఫిర్యదు చేసింది. ఈ ఘాతుకానికి కుటుంబ తగాదానే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.