చిన్నారిని చిదిమేసిన... మాజీ ఖైదీ?!
ఈ నెల ఒకటవ తేదీన జైలునుండి బయటను వచ్చిన మాజీ ఖైదీయే , పదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్యలకు బాధ్యుడని పోలీసులు అనుమానిస్తున్నారు. సికిందరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రైల్వే పట్టాల వద్ద ఒక బాలిక శవం ఉన్నట్టుగా శనివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందింది. బాలిక మొహాన్ని బండరాయితో మోదటంతో గుర్తుపట్టలేనట్టుగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య వెనుక ఉన్న కారణాలపై విచారణ చేశారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఓ […]
ఈ నెల ఒకటవ తేదీన జైలునుండి బయటను వచ్చిన మాజీ ఖైదీయే , పదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్యలకు బాధ్యుడని పోలీసులు అనుమానిస్తున్నారు. సికిందరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రైల్వే పట్టాల వద్ద ఒక బాలిక శవం ఉన్నట్టుగా శనివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం అందింది. బాలిక మొహాన్ని బండరాయితో మోదటంతో గుర్తుపట్టలేనట్టుగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య వెనుక ఉన్న కారణాలపై విచారణ చేశారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కల్లు కాంపౌండ్నుండి బాలికను బయటకు తీసుకువెళుతున్నట్టుగా సిసిటివి ఫుటేజిలో కనిపించింది. అతను సంవత్సరం జైలుశిక్షని అనుభవించి, సంగారెడ్డి జైలు నుండి రెండురోజుల క్రితం బయటకు వచ్చిన వ్యక్తి అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతనే బాలికపై ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు ఆమె శనివారం మధ్యాహ్నం నుండి కనిపించడం లేదని పోలీసు కంప్లయింట్ ఇచ్చారు.