పారిపోయిన కూతుర్ని ఇంటికి తెచ్చి... చంపేశారు!
హర్యానా రాజధాని ఛండీగఢ్లోని సోనీపేట జిల్లా, మటాండ్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమించినవాడిని వదలలేనని కూతురు తెగేసి చెప్పడంతో సహించలేకపోయిన తల్లిదండ్రులు ఆమెని హత్యచేశారు. పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం బాలరాజ్ సింగ్, సునీత దంపతులకు 17ఏళ్ల కుమార్తె ఉంది. కాలేజిలో చదువుకుంటున్న ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది. ఇది ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదు. దాంతో ఆ అమ్మాయి ఆ కుర్రాడితో కలిసి పది రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమెని వెతికి ఇంటికి తీసుకువచ్చిన […]
హర్యానా రాజధాని ఛండీగఢ్లోని సోనీపేట జిల్లా, మటాండ్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమించినవాడిని వదలలేనని కూతురు తెగేసి చెప్పడంతో సహించలేకపోయిన తల్లిదండ్రులు ఆమెని హత్యచేశారు. పోలీసులు అందిస్తున్న వివరాల ప్రకారం బాలరాజ్ సింగ్, సునీత దంపతులకు 17ఏళ్ల కుమార్తె ఉంది. కాలేజిలో చదువుకుంటున్న ఆమె ఒక వ్యక్తిని ప్రేమించింది. ఇది ఆమె తల్లిదండ్రులకు నచ్చలేదు. దాంతో ఆ అమ్మాయి ఆ కుర్రాడితో కలిసి పది రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయింది.
ఆమెని వెతికి ఇంటికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు ఆ బంధాన్ని వదులుకోమని ఒత్తిడి పెట్టారు. అయితే అందుకు ఆమె ఒప్పుకోకపోవటంతో చంపేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆమెని ఇంట్లోనే చంపేసి పిడకల బట్టిలో వేసి దహనం చేశారు. అయితే మంటలు ఉవ్వెత్తున లేవటంతో, చుట్టుపక్కలవారు పోలీసులకు ఫోన్ చేశారు. ఫైరింజన్తో మంటలను ఆర్పిన పోలీసులు సగం కాలిన శరీరాన్ని గుర్తించారు. బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం తల్లిదండ్రులను అరెస్టు చేశారు.
హర్యానాలో అంతకుముందు అయిదురోజుల క్రితం ఇలాంటిదే మరొక సంఘటన జరిగింది. భివానీ అనే గ్రామంలో కూతురి ప్రేమని అంగీకరించలేని తల్లిదండ్రులు… విషం తాగించి హత్య చేశారు. అదే సమయంలో డిప్రెషన్లో ఉన్న తమ సమీప బంధువు ఆత్మహత్య చేసుకోవటంతో అతని చితిలో వేసి కూతురి శవాన్ని దహనం చేశారు.