పద్నాలుగేళ్ల క్రితం తన తాతను చంపాడని....మనుమరాలిపై అత్యాచారం!
ఇదేమి ఘోరమో….14, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుర్రాళ్లు… పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డారు. ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణానికి వెనుక ఉన్న కారణం అచ్చం సినిమా కథలా ఉంది. నిందితులిద్దరిలో ఒకరి తాతని, ఆ చిన్నారి తాత 14 ఏళ్ల క్రితం కాల్చి చంపినందుకు, సమాధానంగా వారిలా కక్ష తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది. బాలికని పొదల్లోకి లాక్కుని వెళ్లి, ఆమె నోరుని గట్టిగా నొక్కి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. పాపని రక్తస్రావంతో […]
ఇదేమి ఘోరమో….14, 15 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుర్రాళ్లు… పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డారు. ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ దారుణానికి వెనుక ఉన్న కారణం అచ్చం సినిమా కథలా ఉంది. నిందితులిద్దరిలో ఒకరి తాతని, ఆ చిన్నారి తాత 14 ఏళ్ల క్రితం కాల్చి చంపినందుకు, సమాధానంగా వారిలా కక్ష తీర్చుకున్నట్టుగా తెలుస్తోంది.
బాలికని పొదల్లోకి లాక్కుని వెళ్లి, ఆమె నోరుని గట్టిగా నొక్కి పెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. పాపని రక్తస్రావంతో చూసిన తల్లి హడలిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఆగ్రాకు తీసుకువెళ్లారు. తన సర్వీసులో ఇలాంటి కేసుని ఎప్పుడూ చూడలేదని పోలీస్ అధికారే ముక్కున వేలేసుకున్నాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తన తాతని, బాలిక తాత హత్య చేయటం వల్లనే ఇలా చేశానని ఇద్దరిలో ఒక కుర్రాడు చెప్పాడు. ఈ పిల్లలను నేరానికి ఉసిగొల్పినది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు రాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.