Telugu Global
Cinema & Entertainment

శర్వానంద్ కు సంస్కారం లేదా..?

ఈ మాట అంటోంది ఎవరో కాదు… స్వయంగా శర్వానంద్ సినిమా దర్శకుడు చేరన్. తెలుగు-తమిళ భాషల్లో శర్వానంద్ ను హీరోగా పెట్టి ఏమిటో ఈమాయ అనే సినిమా చేశాడు చేరన్. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు. నిజానికి ఈ సినిమా ఇప్పటికి కాదు.. రెండేళ్ల కిందటే రిలీజ్ కావాల్సిన మూవీ ఇది. రాజాధిరాజా అనే పేరుపెట్టి ఫ్రెష్ గా కొన్ని వారాల కిందట విడుదల చేశారు. […]

శర్వానంద్ కు సంస్కారం లేదా..?
X

ఈ మాట అంటోంది ఎవరో కాదు… స్వయంగా శర్వానంద్ సినిమా దర్శకుడు చేరన్. తెలుగు-తమిళ భాషల్లో శర్వానంద్ ను హీరోగా పెట్టి ఏమిటో ఈమాయ అనే సినిమా చేశాడు చేరన్. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు. నిజానికి ఈ సినిమా ఇప్పటికి కాదు.. రెండేళ్ల కిందటే రిలీజ్ కావాల్సిన మూవీ ఇది. రాజాధిరాజా అనే పేరుపెట్టి ఫ్రెష్ గా కొన్ని వారాల కిందట విడుదల చేశారు. అయినప్పటికీ ప్రమోషన్ సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా ఆడలేదు. దీనికి కారణం శర్వానందే అంటూ దర్శకుడు చేరన్ విమర్శలు ఎక్కుపెట్టాడు. చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టిమరీ శర్వానంద్ ను దుమ్మెత్తిపోశాడు.

చేరన్ చెబుతున్న వివరాల ప్రకారం… రాజాధిరాజ సినిమాకు శర్వానంద్ కు కోటిరూపాయలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందట. అయితే అప్పట్లో అతడికి మార్కెట్ లేకపోవడంతో 55 లక్షలు మాత్రమే ఇచ్చారట. ఆ తర్వాత మిగతా డబ్బు ఇవ్వడానికి సిద్ధపడినా… శర్వానంద్ తమతో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడలేదని చేరన్ ఆరోపిస్తున్నాడు. పైగా ప్రమోషన్ కు డుమ్మా కొట్టాడని, కావాలనే సినిమాకు నెగెటివ్ పబ్లిసిటీ ఇచ్చాడని విమర్శించాడు. మరోవైపు శర్వానంద్ రాకపోతే తను కూడా రానని నిత్యామీనన్ అనడంతో… ఎలాంటి ప్రచారం లేకుండానే సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని విమర్శించిన చేరన్… తన ప్రెస్ మీట్ ముగించే ముందు శర్వానంద్ ను సంస్కారం లేదంటూ తిట్టిపోశాడు.

First Published:  5 July 2016 9:28 AM GMT
Next Story