చనిపోయిన సంవత్సరానికి.... ట్రాన్స్ఫర్ చేశారు!
మహారాష్ట్రలో ఒక ఎక్సైజ్ అధికారికి ఆ డిపార్టమెంట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ని పంపింది. ఇందులో వింతేముంది అంటారా…కానీ ఆ ఆర్డరుని అందుకోవాల్సిన వ్యక్తి సంవత్సరం క్రితమే మరణించాడు. కొల్హాపూర్కి చెందిన ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎమ్ సాబుల్ గత ఏడాది చనిపోగా అతడిని నాసిక్ జిల్లాలోని సాతానాకి ఫ్లయింగ్ స్క్వాడ్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఆ ఆర్డరులోఉంది. దానిమీద జాయింట్ కమిషనర్ తనూజా డండేకర్ సంతకం కూడా ఉంది. కొల్హాపూర్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ సాబుల్ని వెంటనే రిలీవ్ చేయాలని, నాసిక్ ఎక్సయిజ్ […]
మహారాష్ట్రలో ఒక ఎక్సైజ్ అధికారికి ఆ డిపార్టమెంట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ని పంపింది. ఇందులో వింతేముంది అంటారా…కానీ ఆ ఆర్డరుని అందుకోవాల్సిన వ్యక్తి సంవత్సరం క్రితమే మరణించాడు. కొల్హాపూర్కి చెందిన ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎమ్ సాబుల్ గత ఏడాది చనిపోగా అతడిని నాసిక్ జిల్లాలోని సాతానాకి ఫ్లయింగ్ స్క్వాడ్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఆ ఆర్డరులోఉంది. దానిమీద జాయింట్ కమిషనర్ తనూజా డండేకర్ సంతకం కూడా ఉంది.
కొల్హాపూర్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ సాబుల్ని వెంటనే రిలీవ్ చేయాలని, నాసిక్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ అతడిని వెంటనే డ్యూటీలో జాయిన్ చేసుకుని విధులు అప్పగించాలని ఉంది. సాబుల్ తన ట్రాన్స్ఫర్ని ఆపాలని చూస్తే అది క్రమశిక్షణా రాహిత్యంగా భావించబడుతుందని కూడా ఉంది. ఎక్సయిజ్ కమిషనర్ విజయ్ సింఘాల్ ఇందులో నిజానిజాలపై విచారణ చేస్తానని చెప్పారు. అయితే మహారాష్ట్ర ఎక్సయిజ్ డిపార్ట్మెంట్లో తప్పులు చేసి, అవినీతికి పాల్పడి ఉద్యోగాలు పోగొట్టుకున్నవారు అంతే వేగంగా తిరిగి ఉద్యోగాల్లోకి వస్తారని, వారికే కీలక బాధ్యతలు అప్పగించడమూ జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.