ప్రియుడితో పట్టుబడి...ఆత్మహత్య చేసుకుంది!
ఓ వివాహితురాలు, తన ప్రియుడితో మామగారికి పట్టుబడి ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్లోని సూరత్లో ఈ విషాదం చోటుచేసుకుంది. మోహిని(25) అనే ఈ మహిళకు భర్త కునాల్, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఆమె మామ మహేష్ కపాడియా కూడా వీరితోనే ఉంటున్నాడు. మోహినికి వివాహమై అయిదేళ్లయింది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మోహినితో అక్రమ సంబంధం ఉన్న ధర్మేష్ కడీవాలా ఆమె ఇంటికి వచ్చాడు. వీరిద్దరికీ గత రెండేళ్లుగా పరిచయం ఉంది. ధర్మేష్ తెచ్చిన ఫుడ్ని తింటూ, […]
ఓ వివాహితురాలు, తన ప్రియుడితో మామగారికి పట్టుబడి ఆత్మహత్యకు పాల్పడింది. గుజరాత్లోని సూరత్లో ఈ విషాదం చోటుచేసుకుంది. మోహిని(25) అనే ఈ మహిళకు భర్త కునాల్, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఆమె మామ మహేష్ కపాడియా కూడా వీరితోనే ఉంటున్నాడు. మోహినికి వివాహమై అయిదేళ్లయింది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మోహినితో అక్రమ సంబంధం ఉన్న ధర్మేష్ కడీవాలా ఆమె ఇంటికి వచ్చాడు. వీరిద్దరికీ గత రెండేళ్లుగా పరిచయం ఉంది.
ధర్మేష్ తెచ్చిన ఫుడ్ని తింటూ, మోహిని అతనితో కబుర్లు చెబుతుండగా మహేష్ ఇంటికి వచ్చాడు. తలుపు కొట్టగా మోహిని తలుపు తీయడానికి ఆలస్యం చేయటంతో అతనికి అనుమానం వచ్చింది. గతంలోనూ రెండుసార్లు వారిద్దరూ అలా పట్టుబడ్డారు. ఇక ఎప్పుడూ అలా చేయనని మోహిని మాట ఇచ్చి ఉంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న మహేష్, మోహిని గదిలో వెతికి మంచం కింద ఉన్న ధర్మేష్ని బయటకు లాగాడు. అయితే అతను మహేష్ని వదిలించుకుని పారిపోగా, మహేష్ అతనితో పాటు బయటకు పరిగెత్తాడు. ఈ లోపల మోహిని తలుపులు వేసుకుని తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రి పోన్ చేయటంతో ఇంటికి వచ్చిన కునాల్, ఎంత కొట్టినా మోహిని తలుపులు తీయకపోవటంతో పగులగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా, ఆమె మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. ఇంతకుముందుకూడా ప్రియుడితో పట్టుబడిన మోహిని ఇక అతనికి దూరంగా ఉంటానని మాట ఇచ్చిందని, తిరిగి ఇలా చేసిందని ఆమె భర్త వాపోయాడు. మోహిని ప్రియుడు ధర్మేష్ కడీవాలాకి కూడా పెళ్లయి ఒక కుమార్తె ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.