జనాగ్రహం అంటే ఇలాగే ఉంటుంది...రోడ్లు బాగుచేయని అధికారిని మురుగుకాల్వలోకి దించారు!
జనం ఒక్కటైనపుడు ఆ బలం ఎలా ఉంటుందో చాలా సందర్భాల్లో రుజువైంది. కర్ణాటకలోని కొప్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు మరొకసారి తమ ఆగ్రహాన్నిఅధికారులకు రుచి చూపించారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవటంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. పదేపదే ప్రమాదాలు జరుగుతుండటంతో వారు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో కార్పొరేషన్ ఇంజినీర్లు పరిస్థితిని సమీక్షించడానికి అక్కడకు వచ్చారు. అయితే అక్కడ గుమిగూడిన జనానికి, అధికారులకు మధ్య ఈ విషయంలో వాదనలు […]
జనం ఒక్కటైనపుడు ఆ బలం ఎలా ఉంటుందో చాలా సందర్భాల్లో రుజువైంది. కర్ణాటకలోని కొప్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు మరొకసారి తమ ఆగ్రహాన్నిఅధికారులకు రుచి చూపించారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవటంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. పదేపదే ప్రమాదాలు జరుగుతుండటంతో వారు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలో కార్పొరేషన్ ఇంజినీర్లు పరిస్థితిని సమీక్షించడానికి అక్కడకు వచ్చారు. అయితే అక్కడ గుమిగూడిన జనానికి, అధికారులకు మధ్య ఈ విషయంలో వాదనలు పెరిగాయి. దాంతో ఆగ్రహానికి గురయిన స్థానికులు ఓ ఇంజినీరుని మురుగుకాల్వలోకి నెట్టారు. సామాన్యజనం పడే ఇబ్బందులు అధికారులు గుర్తించాలనే తాము ఆ పని చేశామని వారు చెప్పారు. ఎన్ని విజ్ఞాపనలు చేసినా పట్టించుకోని అధికారుల కళ్లు తెరిపించడానికే ఈ విధంగా చేయాల్సివచ్చిందన్నారు. వర్షాల కారణంగా కొప్పాక జిల్లాలో రోడ్లు గుంతలు పడిపోయి దారుణంగా తయారయ్యాయని, తాము పడుతున్న బాధలు అధికారులకు తెలియాలని అక్కడ గుమిగూడిన జనం అన్నారు.