అక్రమ భవనం కూల్చారు...లోపలున్న మనుషుల ప్రాణాలు తీశారు!
ఏ ప్రమాదమూ జరగలేదు…స్వయంగా మనుషులే కూలగొట్టిన భవనంలో ఉండిపోయి, నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ మీరట్లోని కంటెన్మెంట్లో అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాల కూల్చివేతకు సిద్ధమయ్యారు. శనివారం పొద్దున్నే అక్కడకు చేరుకున్న అధికారులు బంగ్లా నెంబరు 210లో ఉన్నవారికి తమ సామానుతో సహా ఖాళీ చేయాలని చెప్పారు. ఉదయం ఆరుగంటలకు కూల్చివేత మొదలుపెట్టారు. అయితే లోపల ఉన్న మనుషులు పూర్తిగా బయటకు వచ్చారా లేదా…అనే విషయాన్ని నిర్దారించుకోకుండానే కూల్చివేతని మొదలుపెట్టటంతో భవనంలోనే […]
ఏ ప్రమాదమూ జరగలేదు…స్వయంగా మనుషులే కూలగొట్టిన భవనంలో ఉండిపోయి, నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ మీరట్లోని కంటెన్మెంట్లో అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాల కూల్చివేతకు సిద్ధమయ్యారు. శనివారం పొద్దున్నే అక్కడకు చేరుకున్న అధికారులు బంగ్లా నెంబరు 210లో ఉన్నవారికి తమ సామానుతో సహా ఖాళీ చేయాలని చెప్పారు.
ఉదయం ఆరుగంటలకు కూల్చివేత మొదలుపెట్టారు. అయితే లోపల ఉన్న మనుషులు పూర్తిగా బయటకు వచ్చారా లేదా…అనే విషయాన్ని నిర్దారించుకోకుండానే కూల్చివేతని మొదలుపెట్టటంతో భవనంలోనే ఉండిపోయిన నలుగురు వ్యక్తులు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నాలుగు నిండుప్రాణాలు పోయాయని స్థానికులు ఆరోపిస్తుండగా, తాము ముందుగానే వారికి ఖాళీ చేయమని చెప్పామని, వారికి అదనంగా మరో మూడుగంటల సమయం కూడా ఇచ్చామని కంటోన్మెంటు బోర్డు పేర్కొంది. ఏదిఏమైనా ప్రమాదం జరగకుండా నివారించగల అవకాశం ఉన్న చోట కూడా మనుషుల ప్రాణాలు పోవటం అత్యంత విషాదం.