ప్రేమించడం ఆపని కూతురికి...పురుగుల మందు తాగించాడు!
మరో పరువు హత్యకు ప్రయత్నించాడు ఓ తండ్రి. ప్రేమ విషయంలో మాట వినని ఆడపిల్లలు తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. విజయవాడలో తల్లి చేతిలో హతమైన నజ్మా ఉదంతం మర్చిపోకముందే అలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. కూతురికి బలవంతంగా పురుగుల మందు తాగించి చంపాలని ప్రయత్నించాడు ఓ తండ్రి. అనంతపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం…శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుమార్తె అనంతపురంలో ఓ డిగ్రీ కాలేజిలో చదువుతోంది. […]
మరో పరువు హత్యకు ప్రయత్నించాడు ఓ తండ్రి. ప్రేమ విషయంలో మాట వినని ఆడపిల్లలు తల్లిదండ్రుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. విజయవాడలో తల్లి చేతిలో హతమైన నజ్మా ఉదంతం మర్చిపోకముందే అలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. కూతురికి బలవంతంగా పురుగుల మందు తాగించి చంపాలని ప్రయత్నించాడు ఓ తండ్రి. అనంతపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం…శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కుమార్తె అనంతపురంలో ఓ డిగ్రీ కాలేజిలో చదువుతోంది. ఆమె ఒక యువకుని ప్రేమించగా ఈ విషయం తెలుసుకున్న నరసింహారెడ్డి కుమార్తెని మందలించాడు. అతడిని మర్చిపొమ్మని చెప్పాడు.
ఎంత చెప్పినా ఆమె వినకపోవటంతో అతను కుమార్తెని చంపాలని నిర్ణయించుకున్నాడు. శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటున్న కుమార్తెను తీసుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో బుక్కరాయసముద్రం మండలం బాట్లోకొత్తపల్లి గ్రామం ఎస్సీకాలనీ సమీపంలోకి రాగానే కూతురిని బండి దిగమని చెప్పాడు. వెంటనే ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఆ తరువాత గొంతు నులమటంతో ఆమె స్పృహ తప్పింది. కూతురు చనిపోయిందని భావించిన నరసింహారెడ్డి ఆమెని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చిన ఆ యువతి పక్కనే ఉన్న ఒక ప్రయివేటు కాలేజి వద్దకు వెళ్లి జరిగిన విషయాలు చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అదించడంతో, పోలీసులు ఆమెను 108లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి నుండి వివరాలు సేకరించిన పోలీసులు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.