బంతి భోజనాల్లా కూర్చుని...పరీక్షలు రాశారు!
ఒకరిపక్కన ఒకరు కూర్చుని, అందరూ గైడ్లు ముందు పెట్టుకుని పరీక్షలు రాశారు ఆ విద్యార్థులు. జార్ఖండ్ రాష్ట్రం, ధన్బాద్ జిల్లా, గోవింద్పూర్ పట్టణంలోని ఓ కాలేజి పరిస్థితి ఇది. అక్కడ ఇప్పుడు ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా ఆర్మోర్ అనే కాలేజిలో కూడా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే ఆ కళాశాలలో 600 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాసే అవకాశం ఉండగా అధికారులు ఇందులో 1664 మంది విద్యార్థులను కేటాయించారు. దాంతో 1000 మంది విద్యార్థులకు చోటులేని […]
ఒకరిపక్కన ఒకరు కూర్చుని, అందరూ గైడ్లు ముందు పెట్టుకుని పరీక్షలు రాశారు ఆ విద్యార్థులు. జార్ఖండ్ రాష్ట్రం, ధన్బాద్ జిల్లా, గోవింద్పూర్ పట్టణంలోని ఓ కాలేజి పరిస్థితి ఇది. అక్కడ ఇప్పుడు ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా ఆర్మోర్ అనే కాలేజిలో కూడా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే ఆ కళాశాలలో 600 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాసే అవకాశం ఉండగా అధికారులు ఇందులో 1664 మంది విద్యార్థులను కేటాయించారు. దాంతో 1000 మంది విద్యార్థులకు చోటులేని పరిస్థితి తలెత్తింది.
అధికారులు వారిని కళాశాల ప్రాంగణంలో కూర్చుని రాయమని చెప్పి వదిలేశారు. ఇంకేముందీ….మాస్ కాపీయింగ్ జోరుగా సాగింది. పక్కపక్కనే కూర్చుని, గైడ్లు పెట్టుకుని నింపాదిగా పరీక్షలు రాశారు. కాలేజిలోపల కూడా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు. ఈ ఫొటోలు బయటకు రావటంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇటీవల బీహార్లో టాపర్ల కుంభకోణం బయటపడినప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి, బీహార్ విద్యార్థులు తమ రాష్ట్రానికి వచ్చి పరీక్షలు రాసుకోవాల్సిందిగా ఆహ్వానించారు. ఈ ఫొటోలు జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్దాస్ని ఇరుకున పెట్టినా, ఆయన అలా జరిగి ఉండదు… అని బుకాయించడం విశేషం.