Telugu Global
Cinema & Entertainment

యూరోప్ లో మిస్టర్ హల్ చల్

శ్రీనువైట్ల-వరుణ్ తేజ కాంబినేషన్ లో మిస్టర్ సినిమా ఎట్టకేలకు మొదలైంది. ఆగిపోయిందనుకున్న సినిమా, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి ఫైనల్ గా రెగ్యులర్ షూటింగ్ మోడ్ లోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు హీరో వరుణ్ తేజ, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఇప్పటికే స్పెయిన్ చేరుకున్నారు. అటు టెక్నికల్ టీం కూడా యూరోప్ చేరుకుంది. మరోవైపు దర్శకుడు శ్రీను వైట్ల… వారం రోజుల ముందే నుంచే యూరోప్ దేశాల్లో తిరిగి లొకేషన్లు ఫైనలైజ్ చేశాడు. స్పెయిన్, […]

యూరోప్ లో మిస్టర్ హల్ చల్
X

శ్రీనువైట్ల-వరుణ్ తేజ కాంబినేషన్ లో మిస్టర్ సినిమా ఎట్టకేలకు మొదలైంది. ఆగిపోయిందనుకున్న సినిమా, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి ఫైనల్ గా రెగ్యులర్ షూటింగ్ మోడ్ లోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు హీరో వరుణ్ తేజ, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఇప్పటికే స్పెయిన్ చేరుకున్నారు. అటు టెక్నికల్ టీం కూడా యూరోప్ చేరుకుంది. మరోవైపు దర్శకుడు శ్రీను వైట్ల… వారం రోజుల ముందే నుంచే యూరోప్ దేశాల్లో తిరిగి లొకేషన్లు ఫైనలైజ్ చేశాడు. స్పెయిన్, బ్రెజిల్ దేశాల్లో ఈ సినిమాను 45 రోజుల పాటు ఏకథాటిగా షూట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ లోనే మ్యాగ్జిమమ్ టాకీ పార్టీ పూర్తిచేయాలని వైట్ల నిర్ణయించాడు. సినిమాలో యూనివర్సిటీ టాపర్ గా వరుణ్ తేజ కనిపించనున్నాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో పోలీస్ గా కూడా వరుణ్ తేజ కనిపిస్తాడనే టాక్ నడుస్తోంది. ఇక సినిమాలో లావణ్య త్రిపాఠితో పాటు రెజీనా కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో మరోసారి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు వైట్ల ప్రయత్నిస్తున్నాడు. ఆగడు, బ్రూస్ లీ లాంటి రెండు భారీ డిజాస్టర్ల తర్వాత, ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు. అటు వరుణ్ తేజ కూడా ఓ మాంఛి కమర్షియల్ హిట్ కోసం వెయిటింగ్. పూరి జగన్నాధ్ తో చేసిన లోఫర్ ఫ్లాప్ అవ్వడంతో.. కనీసం వైట్లతో చేస్తున్న మిస్టర్ సినిమాతోనైనా కమర్షియల్ హిట్ అందుకోవాలని వరుణ్ తేజ భావిస్తున్నాడు.

First Published:  11 July 2016 1:31 AM GMT
Next Story