మాయమౌతున్న మహిళలు...ఏమౌతున్నారు?!
బెంగలూరులో నివసిస్తున్నఉమేష్ మౌర్య(30), లక్నోలో పిహెచ్డి చేస్తున్న భార్య కోసం కొన్ని నెలలు ఎదురు చూశాడు. ఆమె వస్తుంది…వైవాహిక జీవితం మొదలుపెడదామని. అనుకున్నట్టుగానే సీమా కుష్వాలా (30) 2015 మే నెలలో బెంగలూరు తిరిగి వచ్చింది. కానీ వారి ఆనందం కొన్ని రోజులు కూడా నిలబడలేదు. బెంగలూరు వచ్చిన రెండు రోజుల్లో ఆమె మాయమైంది. రోజులు గడుస్తున్నా ఆమె జాడ తెలియరాలేదు. కొన్ని నెలల పాటు ఉమేష్ చేసిన ప్రయత్నాలు ఫలించి పోలీసుల నుండి ఒకరోజు కబురొచ్చింది. […]
బెంగలూరులో నివసిస్తున్నఉమేష్ మౌర్య(30), లక్నోలో పిహెచ్డి చేస్తున్న భార్య కోసం కొన్ని నెలలు ఎదురు చూశాడు. ఆమె వస్తుంది…వైవాహిక జీవితం మొదలుపెడదామని. అనుకున్నట్టుగానే సీమా కుష్వాలా (30) 2015 మే నెలలో బెంగలూరు తిరిగి వచ్చింది. కానీ వారి ఆనందం కొన్ని రోజులు కూడా నిలబడలేదు. బెంగలూరు వచ్చిన రెండు రోజుల్లో ఆమె మాయమైంది. రోజులు గడుస్తున్నా ఆమె జాడ తెలియరాలేదు. కొన్ని నెలల పాటు ఉమేష్ చేసిన ప్రయత్నాలు ఫలించి పోలీసుల నుండి ఒకరోజు కబురొచ్చింది. సీమ ఉనికి తెలిసిందని. అలా కొన్ని నెలల తరువాత, కొన్ని చేదుజ్ఞాపకాలతో సీమ భర్త చెంతకు చేరగలిగింది.
బెంగలూరులో ఇప్పుడు కనిపించకుండా పోతున్న మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత ఏడాది ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. గత ఏడాది జనవరి నుండి ఈ సంవత్సరం మే నెల వరకు బెంగలూరులో 3,977 మంది మహిళలు నగరంలో అదృశ్యం కాగా అందులో 2,027మంది జాడ ఇంకా తెలియరాలేదు. గత ఏడాది మొత్తంమీద చూసుకుంటే 2,753మంది మాయం కాగా, వారిలో 1,355 మంది మాత్రమే ఇళ్లకు చేరారు. ఈ ఏడాది జనవరి నుండి మే వరకు 1,224మంది మిస్ కాగా వారిలో 672 మందిని మాత్రమే పోలీసులు కనుక్కోగలిగారు. బెంగలూరులోనే కాదు, కర్ణాటక రాష్ట్రంలో చిన్న పట్టణాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. మిస్ అయిపోతున్న మహిళల్లో ఎక్కువ మంది ఇంట్లోంచి పారిపోవడమో, లేదా ప్రేమించిన వాడితో వెళ్లిపోవడమో జరుగుతోందని తెలుస్తోంది.
అయితే మహిళలు ఎక్కడికి వెళ్లిపోతున్నారు, ఎక్కడ ఉంటున్నారు….అనే విషయంపై తమ వద్ద తగిన సమాచారం లేదని ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటున్నారు. పోలీసులు ఈ కేసులకు తగిన ప్రాధాన్యతని ఇవ్వక పోవటంతో ప్రయివేటు డిటెక్టివ్లు ఇందుకు కృషి చేస్తున్నారు కానీ, విజయాలను మాత్రం సాధించలేకపోతున్నారు. మానవ అక్రమ రవాణా విషయంలో కర్ణాటక, దేశంలో మొదటి ఐదు ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. కనిపించకుండా పోతున్న మహిళల్లో ఎక్కువ మంది అక్రమ రవాణాకు గురవుతున్నారని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ లో పనిచేస్తున్నవారు చెబుతున్నారు.