వాళ్లిద్దరూ ప్రేమికులట!
గుంటూరుజిల్లా అడువుల దీవిలో ఉరివేసుకుని మరణించిన జాస్మిన్ కేసు విషయంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. జాస్మిన్ ఉరివేసుకోవటం చూసి కేకలు వేసినందుకే గ్రామస్తులు, జాస్మిన్ బంధువులు ఇద్దరు యువకులను దారుణంగా కొట్టారని భావిస్తుండగా ఆ ఇద్దరిలో ఒకరైన పవన్కుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మరో అంశం వెల్లడించాడు. జాస్మిన్ బంధువులు, గ్రామస్తులు కొట్టగా మరణించిన వేముల సాయి, జాస్మిన్ ప్రేమించుకున్నారని, వీరి ప్రేమ తెలుసుకున్న కుటుంబ సభ్యులు జాస్మిన్ని తిట్టడంతో ఆమె సాయికి ఫోన్ చేసి […]
గుంటూరుజిల్లా అడువుల దీవిలో ఉరివేసుకుని మరణించిన జాస్మిన్ కేసు విషయంలో మరో కొత్త కోణం వెలుగుచూసింది. జాస్మిన్ ఉరివేసుకోవటం చూసి కేకలు వేసినందుకే గ్రామస్తులు, జాస్మిన్ బంధువులు ఇద్దరు యువకులను దారుణంగా కొట్టారని భావిస్తుండగా ఆ ఇద్దరిలో ఒకరైన పవన్కుమార్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మరో అంశం వెల్లడించాడు.
జాస్మిన్ బంధువులు, గ్రామస్తులు కొట్టగా మరణించిన వేముల సాయి, జాస్మిన్ ప్రేమించుకున్నారని, వీరి ప్రేమ తెలుసుకున్న కుటుంబ సభ్యులు జాస్మిన్ని తిట్టడంతో ఆమె సాయికి ఫోన్ చేసి ఉరివేసుకుందని పవన్ తెలిపాడు. జాస్మిన్ని రక్షించడానికి తామిద్దరూ రాగా, గ్రామస్తులు అనుమానించి తమని కొట్టారని అతను పేర్కొన్నాడు. అయితే ఆ యువకులు ఇద్దరూ ప్యాంటు షర్టు ఊడదీసి, బెల్టుతో జాస్మిన్కి ఉరివేస్తుండగా తాము కళ్లారా చూశామని జాస్మిన్ పిన్ని తెలిపింది.