కూతురి బర్త్డేకి కేకు తీసుకెళ్లాడు...పార్టీకి హాజరుకాలేక ఆత్మహత్య చేసుకున్నాడు!
కూతురి పుట్టిన రోజుకని ఆనందంగా ఊరికి వెళ్లిన ఓ తండ్రి ఆ పుట్టిన రోజు వేడుకకే హాజరు కాలేకపోయాడు. భార్య గొడవ పెట్టుకోవటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా, హిందుపురం మండలం, జంగాలపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న లింగస్వామి (30) హంద్రీ నీవా కెనాల్ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటికి వెళుతూ తన కూతురు రవళి పుట్టినరోజుకోసం కేకు కొన్నాడు. అయితే దాంతో పాటు మద్యం బాటిల్ కూడా కొనుక్కుని ఫుల్గా తాగేశాడు. […]
కూతురి పుట్టిన రోజుకని ఆనందంగా ఊరికి వెళ్లిన ఓ తండ్రి ఆ పుట్టిన రోజు వేడుకకే హాజరు కాలేకపోయాడు. భార్య గొడవ పెట్టుకోవటంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా, హిందుపురం మండలం, జంగాలపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న లింగస్వామి (30) హంద్రీ నీవా కెనాల్ ప్రాంతంలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంటికి వెళుతూ తన కూతురు రవళి పుట్టినరోజుకోసం కేకు కొన్నాడు. అయితే దాంతో పాటు మద్యం బాటిల్ కూడా కొనుక్కుని ఫుల్గా తాగేశాడు.
ఇంటికి వెళ్లాక ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. కూతురి చేత కేక్ కట్ చేయించేందుకు అతని భార్య, లింగస్వామిని నిద్రలేపాలని ప్రయత్నించింది. అయితే ఎంత సేపటికి నిద్రలేవకపోవడంతో, అతను లేకుండానే కూతురి పుట్టిన రోజు వేడుక ముగిసింది. సోమవారం ఉదయం మేలుకున్న లింగస్వామితో అతని భార్య వాదనకు దిగింది. కన్నకూతురి పుట్టిన రోజు అని కూడా ఆలోచించకుండా తాగటంపై ఆమె తన కోపాన్ని, బాధని వ్యక్తం చేసింది. అతనికి పశ్చాత్తాపమే కలిగిందో, భార్య తిట్టిందని కోపమే వచ్చిందో కానీ, అదే రోజు రాత్రి బయటకు వెళ్లిపోయి ఓ చెట్టుకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.