అతని షర్టు మీది రక్తపు మరకలు...స్వాతివే!
చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో హత్యకు గురయిన స్వాతి బ్లడ్ శాంపిల్తో, నిందితుడు రామ్కుమార్ షర్టు మీద ఉన్న రక్తపు మరకలు మ్యాచ్ అయినట్టుగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ పరీక్షలు నిర్వహించగా బుధవారం ఫలితం వెల్లడైనట్టుగా పోలీసులు వెల్లడించారు. రామ్కుమార్ని అరెస్టు చేసిన అనంతరం పోలీసులు అతను ఉన్న గదిని వెతగ్గా రక్తపు మరకలు ఉన్న షర్టు దొరికింది. దాంతో పోలీసులు స్వాతి బ్లడ్ శాంపిల్ని, షర్టుని హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. ఇంతకుముందు […]
చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో హత్యకు గురయిన స్వాతి బ్లడ్ శాంపిల్తో, నిందితుడు రామ్కుమార్ షర్టు మీద ఉన్న రక్తపు మరకలు మ్యాచ్ అయినట్టుగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ పరీక్షలు నిర్వహించగా బుధవారం ఫలితం వెల్లడైనట్టుగా పోలీసులు వెల్లడించారు. రామ్కుమార్ని అరెస్టు చేసిన అనంతరం పోలీసులు అతను ఉన్న గదిని వెతగ్గా రక్తపు మరకలు ఉన్న షర్టు దొరికింది. దాంతో పోలీసులు స్వాతి బ్లడ్ శాంపిల్ని, షర్టుని హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు.
ఇంతకుముందు రామ్కుమార్ లాయర్ ఆ షర్టు అతనిది కాదని వాదించాడు. ఈ కేసులో ఇంతకుముందు వాదించిన కృష్ణమూర్తి అనే న్యాయవాది తప్పుకోగా, ఇప్పుడు రామరాజు అనే లాయరు ఈ కేసుని వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితంతో ఈ కేసు మరింత వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉంది.