పెళ్లయిన పదిరోజులకే బిడ్డ పుట్టాడు...అత్తమామలు ఒప్పుకున్నారు!
మధ్యప్రదేశ్, భోపాల్కి సమీపంలోకి పర్వాలియా అనే గ్రామానికి చెందిన ఒక యువతికి ఈ నెల ఏడో తేదీన వివాహమైంది. అయితే పెళ్లయిన పదిరోజులకే ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా ఎలా జరిగిందని అత్తమామలు ఆమెను ప్రశ్నించగా, తమ గ్రామానికి చెందిన కాశీరామ్ శిలావత్ (22) పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్టుగా తెలిపింది. ఎవరికీ చెప్పవద్దని తనని బెదిరించినట్టుగా చెప్పింది. యువతికి తల్లిదండ్రులు లేకపోవటంతో ఆమె తోబుట్టువులతో కలిసి ఉంటోంది. యువతి అత్తమామలు ఫిర్యాదు చేయటంతో పోలీసులు […]
మధ్యప్రదేశ్, భోపాల్కి సమీపంలోకి పర్వాలియా అనే గ్రామానికి చెందిన ఒక యువతికి ఈ నెల ఏడో తేదీన వివాహమైంది. అయితే పెళ్లయిన పదిరోజులకే ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇలా ఎలా జరిగిందని అత్తమామలు ఆమెను ప్రశ్నించగా, తమ గ్రామానికి చెందిన కాశీరామ్ శిలావత్ (22) పలుమార్లు తనపై అత్యాచారం చేసినట్టుగా తెలిపింది. ఎవరికీ చెప్పవద్దని తనని బెదిరించినట్టుగా చెప్పింది. యువతికి తల్లిదండ్రులు లేకపోవటంతో ఆమె తోబుట్టువులతో కలిసి ఉంటోంది. యువతి అత్తమామలు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కాశీరామ్పై కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణలో మరొక విషయం వెల్లడైంది.
ప్రస్తుతం పెళ్లయిన ఈ జంటకు సంవత్సరం క్రితమే నిశ్చితార్ధం జరిగింది. ఈ నేపథ్యంలో కాబోయే భర్తగా అతను ఆమె ఇంటికి తరచుగా వెళుతుండేవాడు. దాంతో బిడ్డ తండ్రి ఎవరన్నది తేల్చేందుకు బిడ్డకు డిఎన్ఎ టెస్టు చేయించాలని పోలీసులు నిర్ణయించారు. యువతి బొద్దుగా ఉండటం వలన ఆమె కడుపుతో ఉన్న విషయం ఎవరూ గ్రహించలేకపోయారని తెలుస్తోంది. వివాహమైన పదిరోజులకే మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెను, ఆ బిడ్డను తాము ఆదరిస్తామని అత్తమామలు చెప్పారు.