ప్రేమించినవాడితో పారిపోయి...రైలు పట్టాల మీద శవమై కనిపించింది!
ప్రేమించినవాడితో పారిపోయిన పదిహేనేళ్ల అమ్మాయి… అతను భయపడి ఇంటికి వెళ్లి పోదామనటంతో ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక, కోలార్ జిల్లాలోని హునాసనహళ్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. హరిధరణి సింగ్ పదవ తరగతి చదువుతోంది. ఆమె తల్లి టీ షాపు నడుపుతుండగా, తండ్రి టూవీలర్ షాపులో పనిచేస్తున్నాడు. ధరణి, అరుణ్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. అతను భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ ఇంట్లో తెలవడంతో ధరణిని తల్లిదండ్రులు మందలించారు. అతనికి దూరంగా ఉండమని హెచ్చరించారు. […]
ప్రేమించినవాడితో పారిపోయిన పదిహేనేళ్ల అమ్మాయి… అతను భయపడి ఇంటికి వెళ్లి పోదామనటంతో ఆత్మహత్యకు పాల్పడింది. కర్ణాటక, కోలార్ జిల్లాలోని హునాసనహళ్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. హరిధరణి సింగ్ పదవ తరగతి చదువుతోంది. ఆమె తల్లి టీ షాపు నడుపుతుండగా, తండ్రి టూవీలర్ షాపులో పనిచేస్తున్నాడు. ధరణి, అరుణ్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది. అతను భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరి ప్రేమ ఇంట్లో తెలవడంతో ధరణిని తల్లిదండ్రులు మందలించారు. అతనికి దూరంగా ఉండమని హెచ్చరించారు. అయితే ఇది నచ్చని ధరణి అరుణ్ కుమార్తో కలిసి ఇంట్లోంచి పారిపోవాలనుకుంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె తల్లిదండ్రులు అరుణ్ కుమార్ మీద కిడ్నాప్ కేసు పెట్టారు.
అయితే ధరణిని తీసుకుని పారిపోయి జీవించాలనుకున్న అరుణ్ కుమార్కి ఆ రెండో రోజే భయం మొదలైంది. దాంతో అతను ఆమెను తిరిగి ఇంటికి వెళ్లిపోమని చెప్పాడు. ధరణికి అతను చెప్పింది నచ్చలేదు. తల్లితండ్రులు ఏమంటారో అని భయపడిందో లేక ప్రేమించిన అరుణ్ కుమార్కి దూరం కావాల్సి వస్తుందనుకుందో కానీ..ఆమె రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. కెఆర్ పురం, వైట్ఫీల్డ్ మధ్య నున్న రైల్వే ట్రాక్ మీద బాలిక శవాన్ని గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందే తమ కుమార్తె కనిపించడం లేదని ధరణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండటంతో, వారికి సమాచారం అందింది. కన్నకూతురిని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరయిన తల్లిదండ్రులు… అరుణ్ కుమారే ఇందుకు బాధ్యుడని పోలీసులకు చెప్పటంతో పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ధరణి మైనర్ కావటంతో… అతనిపై పిల్లలకు లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే చట్టం కింద కూడా కేసు నమోదు చేయటం జరుగుతుందని పోలీసులు తెలిపారు.