డ్యాన్స్ ట్రూప్లో చేరనందుకు...సామూహిక అత్యాచారం!
ఉత్తర ప్రదేశ్లో ఈ దారుణం చోటు చేసుకుంది. తన నాట్య బృందంలో చేరడానికి నిరాకరించినందుకు ఓ మహిళ ఓ యువతి పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. ఆమెని సామూహిక అత్యాచారానికి గురిచేసింది. వారణాసిలో ఉంటున్న బాధితురాలు (26), తన తల్లిని చూసేందుకు గోరఖ్పూర్ వచ్చింది. అక్కడ ఆమె తల్లి స్నేహితురాలు, తన నాట్య బృందం చేరాల్సిందిగా యువతిని కోరింది. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అప్పటికి ఆ విషయాన్ని వదిలేసినట్టు నటించిన ఆ మహిళ, ఖుషీ నగర్లో తమ […]
ఉత్తర ప్రదేశ్లో ఈ దారుణం చోటు చేసుకుంది. తన నాట్య బృందంలో చేరడానికి నిరాకరించినందుకు ఓ మహిళ ఓ యువతి పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించింది. ఆమెని సామూహిక అత్యాచారానికి గురిచేసింది. వారణాసిలో ఉంటున్న బాధితురాలు (26), తన తల్లిని చూసేందుకు గోరఖ్పూర్ వచ్చింది. అక్కడ ఆమె తల్లి స్నేహితురాలు, తన నాట్య బృందం చేరాల్సిందిగా యువతిని కోరింది. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అప్పటికి ఆ విషయాన్ని వదిలేసినట్టు నటించిన ఆ మహిళ, ఖుషీ నగర్లో తమ కుటుంబంలో వివాహం ఉందని, తనకు సహాయం చేయాల్సిందిగా కోరుతూ ఆ యువతిని తీసుకువెళ్లింది.
అక్కడ తిరిగి ఆమెని నృత్యం చేయమని బలవంతపెట్టింది. బాధితురాలు ఒప్పుకోకపోవటంతో ఆ మహిళకు చెందిన అయిదుగురు దుండగులు యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒంటిమీద కాలిన గాయాలు చేశారు. ఆహారం కూడా ఇవ్వకుండా హింసించారు. శుక్రవారం ఉదయం నిందితులు నిద్రపోతుండగా యువతి తప్పించుకుని పారిపోయి తల్లిని చేరింది. తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు శనివారం నిందితులపై కేసు నమోదు చేశారు.