నా భార్యాపిల్లలు అమెరికా పౌరులు...వాళ్ల ఆస్తులు బయటపెట్టను " మాల్యా
కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా.. తన పేరుమీద, తన భార్యాపిల్లల పేరు మీద దేశవిదేశాల్లో కూడబెట్టిన ఆస్తుల వివరాలు మొత్తం బయటపెట్టాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశించింది. ఇదే విషయంపై ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసినా ఆయన సదరు వివరాలు వెల్లడించలేదని అటార్నీ జర్నల్ ముకుల్ రోహత్గి కోర్టుకి చెప్పడంతో కోర్టు మరొకసారి ఈ ఆదేశాలు ఇచ్చింది. విజయ్ మాల్యాకు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోవాలంటే మాల్యా, ఆయన భార్యాపిల్లల ఆస్తుల వివరాలు అవసరమని బ్యాంకులు […]
కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా.. తన పేరుమీద, తన భార్యాపిల్లల పేరు మీద దేశవిదేశాల్లో కూడబెట్టిన ఆస్తుల వివరాలు మొత్తం బయటపెట్టాల్సిందేనని సుప్రీంకోర్టు మరోసారి ఆదేశించింది. ఇదే విషయంపై ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసినా ఆయన సదరు వివరాలు వెల్లడించలేదని అటార్నీ జర్నల్ ముకుల్ రోహత్గి కోర్టుకి చెప్పడంతో కోర్టు మరొకసారి ఈ ఆదేశాలు ఇచ్చింది.
విజయ్ మాల్యాకు ఇచ్చిన అప్పులు వసూలు చేసుకోవాలంటే మాల్యా, ఆయన భార్యాపిల్లల ఆస్తుల వివరాలు అవసరమని బ్యాంకులు కూడా కోర్టుకి తెలిపాయి. దాంతో నాలుగువారాల్లో సమాధానం కావాలని మాల్యాను కోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే మాల్యా.. ప్రవాస భారతీయుడిగా విదేశాల్లో ఉన్న తన ఆస్తుల వివరాలు గానీ, అమెరికా పౌరులైన తన భార్యాపిల్లల ఆస్తుల వివరాలు కానీ బయటపెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.