రోడ్డుమీదే హత్య చేశారు...ఆర్టీసీ బస్టాండులో చేతులు కడుక్కున్నారు!
కర్నూలు జిల్లా నంధ్యాలలోని శ్రీనివాస సెంటర్లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ వైద్యుని నలుగురు దుండగులు నడిరోడ్డుమీద హత్య చేశారు. తరువాత తాపీగా బస్టాండుకి వెళ్లి రక్తపు మరకలయిన చేతులను కడుక్కున్నారు. రాళ్లతో ఎలా కొట్టి చంపారో చెప్పుకుంటూ కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. వాళ్లు చేతులు కడుక్కోవటం, మాట్లాడుకోవటం సిసిటివి కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. మహానంది మండలం గాజులపల్లి పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న శైలజానాథ్రెడ్డిని నలుగురు దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. వారికి, శైలజానాథ్ రెడ్డికి […]
కర్నూలు జిల్లా నంధ్యాలలోని శ్రీనివాస సెంటర్లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ వైద్యుని నలుగురు దుండగులు నడిరోడ్డుమీద హత్య చేశారు. తరువాత తాపీగా బస్టాండుకి వెళ్లి రక్తపు మరకలయిన చేతులను కడుక్కున్నారు. రాళ్లతో ఎలా కొట్టి చంపారో చెప్పుకుంటూ కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. వాళ్లు చేతులు కడుక్కోవటం, మాట్లాడుకోవటం సిసిటివి కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. మహానంది మండలం గాజులపల్లి పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న శైలజానాథ్రెడ్డిని నలుగురు దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. వారికి, శైలజానాథ్ రెడ్డికి గతంలో ఎలాంటి పరిచయం లేదు. తాగి పోట్లాడుకుంటున్న యువకులకు సర్ది చెప్పబోయినందుకే, ఆయన దుండగుల ఆగ్రహానికి బలయ్యారని తెలుస్తోంది.