మేకను కాపాడబోయి...ముగ్గురు మృతి!
ఉత్తర ప్రదేశ్, కాన్పూర్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బావిలో పడిపోయిన ఒక మేకని కాపాడటానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శివం (25) అనే వ్యక్తికి చెందిన మేక బావిలో పడిపోగా, అతను దాన్ని రక్షించడానికి బావిలోకి దిగాడు. అయితే లోపలికి వెళ్లిన అతను ఊపిరి ఆడక, కాపాడమంటూ కేకలు వేశాడు. అతడిని కాపాడటానికి లోపలికి దిగి, రాజేష్ యాదవ్ (37) అనే వ్యక్తి కూడా స్పృహ కోల్పోయాడు. అతను బయటకు […]
ఉత్తర ప్రదేశ్, కాన్పూర్ జిల్లాలోని ఖేర్వా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బావిలో పడిపోయిన ఒక మేకని కాపాడటానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. శివం (25) అనే వ్యక్తికి చెందిన మేక బావిలో పడిపోగా, అతను దాన్ని రక్షించడానికి బావిలోకి దిగాడు. అయితే లోపలికి వెళ్లిన అతను ఊపిరి ఆడక, కాపాడమంటూ కేకలు వేశాడు. అతడిని కాపాడటానికి లోపలికి దిగి, రాజేష్ యాదవ్ (37) అనే వ్యక్తి కూడా స్పృహ కోల్పోయాడు. అతను బయటకు రాకపోవటంతో పైన ఉన్న సురేష్ యాదవ్ (45) కూడా బావిలోకి దిగాడు. తరువాత ముగ్గురి కుటుంబాల వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి…బాధితులను బయటకు తీశారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు… వారు మరణించినట్టుగా వెల్లడించారు.
వారు ముగ్గురు ఊపిరి ఆడక చనిపోయినట్టుగా డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో మేకకూడా చనిపోవటం గుర్తించారు. గ్రామస్తులు నష్టపరిహారం కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేయగా అదికారులు, అందుకు ప్రయత్నిస్తామని చెప్పి వారిని శాంతింపచేశారు. ఆ బావి 40 అడుగుల లోతు ఉందని, చాలా పురాతనమైనదని పోలీసులు వెల్లడించారు.