జైళ్లలో ఖైదీలకు యోగా పరీక్షలు...మంచి మార్కులు వస్తే శిక్షలో మినహాయింపు!
మహారాష్ట్ర జైళ్లలో ఖైదీలకు యోగాపై పరీక్షలు నిర్వహించారు. వాటిలో మొదటి స్థానాలు తెచ్చుకున్నవారికి శిక్షలో మినహాయింపు ఇచ్చారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం యోగాని ప్రమోట్ చేయాల్సిందిగా పిలుపు ఇవ్వటంతో రాష్ట్ర జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏడు సెంట్రల్ జైళ్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం మే, జూన్ల్లో మొదటి యోగా పరీక్షని నిర్వహించి జులై చివరికి ఫలితాలు వెల్లడించారు. ఇందులో ఓ రేప్ కేసులో 2012నుండి శిక్ష అనుభవిస్తున్న షీతల్ […]
మహారాష్ట్ర జైళ్లలో ఖైదీలకు యోగాపై పరీక్షలు నిర్వహించారు. వాటిలో మొదటి స్థానాలు తెచ్చుకున్నవారికి శిక్షలో మినహాయింపు ఇచ్చారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం యోగాని ప్రమోట్ చేయాల్సిందిగా పిలుపు ఇవ్వటంతో రాష్ట్ర జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఏడు సెంట్రల్ జైళ్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం మే, జూన్ల్లో మొదటి యోగా పరీక్షని నిర్వహించి జులై చివరికి ఫలితాలు వెల్లడించారు. ఇందులో ఓ రేప్ కేసులో 2012నుండి శిక్ష అనుభవిస్తున్న షీతల్ కవాలే ప్రథముడిగా నిలిచాడు. ఇతను సెప్టెంబరులో విడుదల కావాల్సి ఉండగా 40 రోజులు ముందుగా నాగపూర్ సెంట్రల్ జైలు నుండి విడుదల చేశారు. అలాగే సచిన్, బాలు అనే ఖైదీలు దాడి కేసులో 2011నుండి శిక్ష అనుభవిస్తున్నారు. వీరికి యోగా పరీక్షలో 100కు 83, 70 మార్కులు రాగా వీరిద్దరికి కూడా శిక్షాకాలంలో 40 రోజులు, 30 రోజులు మినహాయింపు ఇచ్చి విడుదల చేశారు.
61 మంది ఖైదీలు యోగా పరీక్షలు రాశారు. మొత్తం ఎనిమిది మంది ఖైదీలకు శిక్షాకాలం నుండి 40, 30 రోజుల మినహాయింపు లభించింది. ఈ పరీక్షలను బాబా రాందేవ్ పతంజలి యోగ్ పీఠ్ నిర్వహించింది. ఈ ఇన్స్టిట్యూట్ నుండి ఒక మహిళా శిక్షకురాలు, ఒక శిక్షకుడు వచ్చి జైళ్లలో యోగా క్లాసులు చెబుతున్నారు. కొన్నినెలల కోర్సులుగా వీటిని అందిస్తున్నారు.
ఈ సంవత్సరం మొదట్లో మహారాష్ట్రలోని జైళ్లలో బాబా రాందేవ్ యోగా క్యాంపులు నిర్వహించారు. జైళ్లలో యోగాని నేర్పడం మొదలుపెట్టాక ఖైదీలు ఫిట్గా, ఆరోగ్యంగా ఉంటున్నారని, కొంతమంది ధ్యానం కూడా చేస్తున్నారని, వారిలో ప్రశాంతత పెరిగిందని అధికారులు వెల్లడించారు.