Telugu Global
NEWS

రాష్ట్రంలో హిట్లర్ పాలన

చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలో ప్రభుత్వం కూల్చివేసిన ఆలయాలను, గోశాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. దేవాలయాలను కూల్చిన ప్రదేశంలో టాయిలెట్లు నిర్మిస్తుండడం చూసి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో పాలన హిట్లర్ పాలనలాగా ఉందన్నారు. కూల్చివేసిన దేవాలయాలను వెంటనే నిర్మించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దొంగల్లాగా అర్థరాత్రి వచ్చి విగ్రహాలను […]

రాష్ట్రంలో హిట్లర్ పాలన
X

చంద్రబాబు ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలో ప్రభుత్వం కూల్చివేసిన ఆలయాలను, గోశాలను ఎమ్మెల్యేలు పరిశీలించారు. దేవాలయాలను కూల్చిన ప్రదేశంలో టాయిలెట్లు నిర్మిస్తుండడం చూసి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో పాలన హిట్లర్ పాలనలాగా ఉందన్నారు. కూల్చివేసిన దేవాలయాలను వెంటనే నిర్మించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. దొంగల్లాగా అర్థరాత్రి వచ్చి విగ్రహాలను కూల్చడం ఏమిటిని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూనే ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర పెద్దలను బాగా తిట్టేస్తున్న టీడీపీ నేతలపై ఎదురుదాడి చేసేందుకు విజయవాడలో ఆలయాల కూల్చివేత అంశం బీజేపీకి చిక్కినట్టుగా ఉంది.

Click on Image to Read:

balakrishna

paritala sunitha

modi

amaravathi central pollution control board

l ramana

chandrababu naidu

Sadguru Jaggi Vasudev chandrababu naidu

jc-diwakar-reddy

gottipati

undavalli

devineni nehuru

tdp media

sujana chowdary

anam vivekananda reddy

First Published:  4 Aug 2016 2:27 AM GMT
Next Story