వంద రూపాయలు లంచం ఇవ్వలేదని...ఇద్దరిని కొట్టి చంపిన పోలీసులు!
వందరూపాయలు లంచం ఇవ్వలేదని పోలీసులు ఇద్దరు యువకులను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్, మెయిన్ పురి జిల్లాలో చోటుచేసుకుంది. మొదట ఆ ఇద్దరు యువకులు… తమనుండి తప్పించుకుని పోతూ చెరువులోపడి మరణించారని బుకాయించిన పోలీసులు… తరువాత నిజం ఒప్పుకోవాల్సివచ్చింది. మృతుల బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. వారు అందిస్తున్న వివరాల ప్రకారం… నలుగురు కార్మికులు కలిసి ఇటుకల ట్రక్లో ప్రయాణం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు మెయిన్పురిలో చెక్ పోస్టు వద్ద ట్రక్కుని […]
వందరూపాయలు లంచం ఇవ్వలేదని పోలీసులు ఇద్దరు యువకులను కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్, మెయిన్ పురి జిల్లాలో చోటుచేసుకుంది. మొదట ఆ ఇద్దరు యువకులు… తమనుండి తప్పించుకుని పోతూ చెరువులోపడి మరణించారని బుకాయించిన పోలీసులు… తరువాత నిజం ఒప్పుకోవాల్సివచ్చింది. మృతుల బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. వారు అందిస్తున్న వివరాల ప్రకారం… నలుగురు కార్మికులు కలిసి ఇటుకల ట్రక్లో ప్రయాణం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు మెయిన్పురిలో చెక్ పోస్టు వద్ద ట్రక్కుని ఆపారు. వంద రూపాయలు ఇస్తేగానీ ట్రక్ని ముందుకు పోనివ్వమని బెదిరించారు. అందుకు డ్రైవర్ వినేష్ నిరాకరించడంతో పోలీసులకు… వారికి గొడవ మొదలైంది. వెంటనే వినేష్, మరో ఇద్దరితో కలిసి అక్కడి నుండి పారిపోయాడు. దిలీప్ యాదవ్, పంకజ్ యాదవ్ అనే ఇరువురు కజిన్స్ మాత్రం పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వారిని చితకబాదటంతో వారిద్దరూ మరణించారు. మృతదేహాలను పోలీసులు దగ్గరలో ఉన్న చెరువులో పడేశారు.
తెల్లవారి చెరువులో మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. ఆ ప్రాంతపు గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరి ఆందోళనకు దిగారు. ట్రాఫిక్ స్థంబించడంతో పరిస్థితిని సరిచేయడానికి వచ్చిన ఇద్దరు పోలీసులను కూడా ఆందోళన కారులు చితకబాదారు. ఇద్దరు హోంగార్డులతో సహా ఆరుగురు పోలీసులపై ఫిర్యాదు అందినట్టుగా మెయిన్పురి ఎస్పి దేవ్ రంజన్ వర్మ తెలిపారు. ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుల్స్పై కేసులు నమోదు చేసి వారిని సస్సెండ్ చేశామని, వారితో పాటు ఇటుకబట్టి ఓనర్లపై కూడా కేసులు నమోదు చేసినట్టుగా ఆయన చెప్పారు.