Telugu Global
Cinema & Entertainment

ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన మహేష్...

మహేష్-మురుగదాస్ సినిమాకు సంబంధించి మొన్నటివరకు చాలా పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ కు సంబంధించి ఓ పుకారు బాగా నడిచింది. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో రాబోతున్న ఈ సినిమా కోసం శ్రీదేవి కూతురు జాహ్నవిని ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. ఆమె పొమ్మనడంతో ఫైనల్ గా రకుల్ ప్రీత్ సింగ్ తో కానిచ్చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ ప్రచారంపై మహేష్ టీం క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలపై మహేష్ సినిమా యూనిట్ స్వయంగా స్పందించింది. మహేష్ […]

ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన మహేష్...
X
మహేష్-మురుగదాస్ సినిమాకు సంబంధించి మొన్నటివరకు చాలా పుకార్లు షికార్లు చేశాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్ కు సంబంధించి ఓ పుకారు బాగా నడిచింది. తెలుగు-తమిళ-హిందీ భాషల్లో రాబోతున్న ఈ సినిమా కోసం శ్రీదేవి కూతురు జాహ్నవిని ప్రయత్నించారనే ప్రచారం జరిగింది. ఆమె పొమ్మనడంతో ఫైనల్ గా రకుల్ ప్రీత్ సింగ్ తో కానిచ్చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ ప్రచారంపై మహేష్ టీం క్లారిటీ ఇచ్చాడు.
ఈ వార్తలపై మహేష్ సినిమా యూనిట్ స్వయంగా స్పందించింది. మహేష్ -మురుగదాస్ సినిమా కోసం కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకుని పరిణితీ చోప్రాను సంప్రదించామని…. కానీ ఆమె కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేకపోవడంతో… రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశామని క్లారిటీ ఇచ్చారు. అంతేతప్ప శ్రీదేవి కుమార్తె జాహ్నవిని అసలు ఈ విషయంపై సంప్రదించలేదని, ఈ రూమర్లన్నీ ఎలా వచ్చాయో తెలియదడంలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే జాహ్నవి తండ్రి బోనీ కపూర్ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. మహేష్ నుంచి ఎవరూ తన కూతురి కోసం సంప్రదించలేదని స్పష్టంచేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
First Published:  6 Aug 2016 12:43 PM GMT
Next Story