పాకిస్తాన్లో ఆత్మాహుతి బాంబు దాడి...40మంది మృతి!
పాకిస్తాన్లో కొన్ని గంటల ముందు జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దాదాపు నలభైమంది మృతి చెందారు. అనేకమంది గాయపడినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలోచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెటాలో… ఈ రోజు ఉదయం హత్యకు గురయిన తమ సహచర న్యాయవాదిని చూసేందుకు హాస్పటల్కి వచ్చిన అనేకమంది న్యాయవాదులు… ఈ దాడిలో మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలోని యాక్సిడెంట్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వద్ద ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. సోమవారం ఉదయం… బలోచిస్తాన్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బిలాల్ […]
పాకిస్తాన్లో కొన్ని గంటల ముందు జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో దాదాపు నలభైమంది మృతి చెందారు. అనేకమంది గాయపడినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని బలోచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెటాలో… ఈ రోజు ఉదయం హత్యకు గురయిన తమ సహచర న్యాయవాదిని చూసేందుకు హాస్పటల్కి వచ్చిన అనేకమంది న్యాయవాదులు… ఈ దాడిలో మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలోని యాక్సిడెంట్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వద్ద ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.
సోమవారం ఉదయం… బలోచిస్తాన్ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బిలాల్ అన్వర్ కాశీని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయగా…ఆయన మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున లాయర్లు ఆసుపత్రికి వచ్చారు. వీరితో పాటు ఎక్కువ సంఖ్యలో జర్నలిస్టులు కూడా సంఘటన ప్రదేశంలో ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది నల్లకోట్లు, టైలు ధరించి ఉన్నారని సమాచారం. క్వెటా… ఇరాన్ ఆఫ్ఘానిస్తాన్ బోర్డరులో ఉంది. ఇక్కడ సున్ని, షియా తెగల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.