మనుషుల పిరమిడ్ ఎత్తుపై...నేడు సుప్రీం నిర్ణయం!
మనుషులు ఒకరిపై ఒకరు ఎక్కుతూ నిర్మించే హ్యూమన్ పిరమిడ్ ఎంత ఎత్తు ఉండాలి…అనే విషయంపై సుప్రీం కోర్టు నేడు నిర్ణయం ప్రకటించనుంది. మహారాష్ట్రలో దహీ–హందీ పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టీకరణ కావాలంటూ ఈ నెల మూడున సుప్రీం కోర్టుని కోరింది. అంతకుముందు ముంబయి హైకోర్టు…సుప్రీం కోర్టు నుండి వివరణ తీసుకోకపోవటంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టగా…రాష్ట్ర ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. గతంలో హ్యూమన్ పిరమిడ్ ఎత్తు గురించి దాఖలైన ప్రజాప్రయోజన […]
మనుషులు ఒకరిపై ఒకరు ఎక్కుతూ నిర్మించే హ్యూమన్ పిరమిడ్ ఎంత ఎత్తు ఉండాలి…అనే విషయంపై సుప్రీం కోర్టు నేడు నిర్ణయం ప్రకటించనుంది. మహారాష్ట్రలో దహీ–హందీ పేరుతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టీకరణ కావాలంటూ ఈ నెల మూడున సుప్రీం కోర్టుని కోరింది.
అంతకుముందు ముంబయి హైకోర్టు…సుప్రీం కోర్టు నుండి వివరణ తీసుకోకపోవటంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టగా…రాష్ట్ర ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. గతంలో హ్యూమన్ పిరమిడ్ ఎత్తు గురించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ముంబయి హైకోర్టు …ఈ విషయంపై సుప్రీం కోర్టుని సంప్రదించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు 2014, ఆగస్టు11న హ్యూమన్ పిరమిడ్లు 20 అడుగులకు మించి ఉండకూడదని, 18ఏళ్ల లోపు వయసున్న వారు దహి–హందీ ఉత్సవాల్లో పాలుపంచుకోకూడదని ఆదేశాలు జారీ చేసి ఉంది.
Click on Image to Read: