జ్యోతిరాదిత్య కారు ఢీకొని...వృద్ధుడు మృతి!
మాజీ కేంద్రమంత్రి, ఎంపి జ్యోతిరాదిత్య సింధియా ప్రయాణం చేస్తున్న కారు కింద పడి 70 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. కేరళలోని అలప్పుజా జిల్లాలో థాంకీ జంక్షన్ ప్రాంతంలో నేషనల్ హైవే 66పై ప్రయాణిస్తున్న సింధియా కారు బుధవారం… ఎలక్ట్రిక్ స్కూటర్పై వస్తున్న ఒక వృద్ధుని ఢీకొట్టింది. అతడిని వెంటనే దగ్గరలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతుని పేరు శశి అని అలప్పుజా జిల్లాలోని చేర్తలకు చెందినవాడని పోలీసులు గుర్తించారు. సింధియా, అలప్పుజా ఎంపి కె […]
మాజీ కేంద్రమంత్రి, ఎంపి జ్యోతిరాదిత్య సింధియా ప్రయాణం చేస్తున్న కారు కింద పడి 70 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. కేరళలోని అలప్పుజా జిల్లాలో థాంకీ జంక్షన్ ప్రాంతంలో నేషనల్ హైవే 66పై ప్రయాణిస్తున్న సింధియా కారు బుధవారం… ఎలక్ట్రిక్ స్కూటర్పై వస్తున్న ఒక వృద్ధుని ఢీకొట్టింది. అతడిని వెంటనే దగ్గరలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతుని పేరు శశి అని అలప్పుజా జిల్లాలోని చేర్తలకు చెందినవాడని పోలీసులు గుర్తించారు. సింధియా, అలప్పుజా ఎంపి కె సి వేణుగోపాల్ తాలూకూ ఫంక్షన్కి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారుని ప్రమాదం జరిగిన పరిధిలోని పోలీస్ స్టేషన్కి తరలించారు.