ఢిల్లీలో పావుగంటకో కారు దొంగతనం...దొంగల్లో స్టూడెంట్లు, ఐటి ఉద్యోగులు!
ఢిల్లీలో కార్ల దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రతి పావుగంటకు ఒక కారు దొంగతనం జరుగుతోంది….లేదా బలవంతంగా లాక్కుంటున్నారు. ఇటీవల వెల్లడైన లెక్కల ప్రకారం గత నెలలో ప్రతిరోజూ 100 వాహనాల దొంగతనం జరిగింది. 2011లో జరిగిన వాహనాల దొంగతనాలతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం దొంగతనాలు రెట్టింపు అయ్యాయని పోలీసుల అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా పోలీసులు దొంగలనుండి రికవరీ చేస్తున్న కార్ల సంఖ్యకూడా రానురాను తగ్గుతోంది. తూర్పుఢిల్లీలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తూర్పుడిల్లీలోని జిల్లాలో ఒక్క జులై నెలలోనే […]
ఢిల్లీలో కార్ల దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రతి పావుగంటకు ఒక కారు దొంగతనం జరుగుతోంది….లేదా బలవంతంగా లాక్కుంటున్నారు. ఇటీవల వెల్లడైన లెక్కల ప్రకారం గత నెలలో ప్రతిరోజూ 100 వాహనాల దొంగతనం జరిగింది. 2011లో జరిగిన వాహనాల దొంగతనాలతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం దొంగతనాలు రెట్టింపు అయ్యాయని పోలీసుల అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా పోలీసులు దొంగలనుండి రికవరీ చేస్తున్న కార్ల సంఖ్యకూడా రానురాను తగ్గుతోంది. తూర్పుఢిల్లీలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తూర్పుడిల్లీలోని జిల్లాలో ఒక్క జులై నెలలోనే 515 కేసులు నమోదు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
దొంగలు ఎక్కువగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన కార్లను టార్గెట్ చేస్తున్నారు. వారు మాస్టర్ కీలను ఉపయోగించి లేదా కారుడోర్ల లాక్లను బద్దలు కొట్టి దొంగతనాలు చేస్తున్నారు. టూవీలర్ల విషయానికి వస్తే హ్యాండిల్ లాక్ని బ్రేక్ చేసి డూప్లికేట్ కీని వాడతారని అధికారులు చెబుతున్నారు. రాత్రి తొమ్మిది నుండి తెల్లవారుజామున ఆరు వరకు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని చాలావరకు బహిరంగ పార్కింగ్ ప్రాంతాల్లోనే కార్ల దొంగలు విజృంభిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
గత నెలలో దొంగలనుండి 283 వాహనాలను రివవరీ చేశామని…అయితే 64 కేసులు… కారు ఓనర్లు తప్పుడు కేసులు పెట్టినట్టుగా గుర్తించామని వారు తెలిపారు. దొంగలు కారుని దొరికించుకున్న వెంటనే హర్యానా లేదా ఉత్తర ప్రదేశ్ వెళ్లిపోయి వాటిలోని విడిభాగాలను అమ్మేసి కార్లను తుక్కుగా మార్చేస్తున్నారని…ఆధారాలు లేకుండా చేస్తున్నారని అన్నారు. కారు మెకానిక్లు, వాహనాల దొంగలు…వాటిని కొనేవారికి మధ్య బలమైన సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న మరో విషయం…55 శాతం దొంగలు విలాసవంతంగా జీవించడం కోసం మొదటిసారి దొంగతనం చేస్తున్నారు అయి ఉంటున్నారు. అంటే కార్ల దొంగలు ఎప్పటికప్పుడు కొత్తవారు పెరుగుతున్నారు. చాలా సందర్భాల్లో కాలేజి విద్యార్థులు, ఐటి ఉద్యోగులు కూడా కార్ల దొంగలుగా పట్టుబడుతున్నారు. దొంగలను త్వరగా పట్టుకోవాలంటే కార్లకు జిపిఎస్ సదుపాయం ఉంటే మంచిదని పోలీసులు కార్ల యజమానులకు సూచిస్తున్నారు.