ఢిల్లీలో మోడీ ప్రతిజ్ఞలు...ఉనాలో ఇక చాలు...చాలన్నారు!
దళితుల మీద దాడితో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన గుజరాత్లోని చిన్న పట్టణం ఉనాలో….రోహిత్ వేముల తల్లి రాధిక జాతీయ జెండాని ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గుజరాత్ దళిత ఉద్యమం ఈ నెల ఐదున ఆహ్మదాబాద్లో మొదలై స్వాతంత్ర్య దినోత్సవం రోజుకి ఉనాకి చేరింది. ఉనాలో భారీ సంఖ్యలో జనం ర్యాలీలో పాల్గొన్నారు. వేలమంది జనం సమక్షంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్ధి కన్హయ్య కుమార్ ప్రసంగించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ..దేశంలో […]
దళితుల మీద దాడితో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన గుజరాత్లోని చిన్న పట్టణం ఉనాలో….రోహిత్ వేముల తల్లి రాధిక జాతీయ జెండాని ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గుజరాత్ దళిత ఉద్యమం ఈ నెల ఐదున ఆహ్మదాబాద్లో మొదలై స్వాతంత్ర్య దినోత్సవం రోజుకి ఉనాకి చేరింది. ఉనాలో భారీ సంఖ్యలో జనం ర్యాలీలో పాల్గొన్నారు. వేలమంది జనం సమక్షంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్ధి కన్హయ్య కుమార్ ప్రసంగించాడు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోడీ..దేశంలో సామాజిక సామరస్యానికి తాము పెద్ద పీట వేస్తున్నామని. ప్రభుత్వం బలహీన వర్గాల హక్కులను కాపాడటానికి కట్టుబడి ఉందని చెప్పగా… కన్హయ్య తన ప్రసంగంలో మోడీ మాటలపై ఎదురుదాడి చేశాడు. ఇలాంటి వాగ్దానాలను విని విని విసిగిపోయి ఉన్నామన్నాడు. గుజరాత్ని అభివృద్ధి నమూనాగా ప్రపంచానికి చూపటంపై కూడా కన్హయ్య కుమార్ విమర్శలు సంధించాడు.
తమ ఆందోళన రాజకీయపరమైనది కాదని, దళితుల ప్రాథమిక హక్కుల కోసమని…దళితుల పేర్లమీద భూములు కేటాయించి వారికి ఎన్నటికీ ఆ భూములపై అధికారాన్ని ఇవ్వకపోవటం… లాంటి అన్యాయాలపై పోరాటమే తమ లక్ష్యమని అతను తన ప్రసంగంలో అన్నాడు. ఉనాలోనూ, ఇంకా రాష్ట్రవ్యాప్తంగానూ ఉన్న ముస్లింలు ఉనాలో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని దళితులకు తమ మద్ధతుని ప్రకటించారు. కుల వివక్షని సహించలేక రోహిత్ వేముల ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడగా…ఫిబ్రవరిలో కన్హయ్య కుమార్ని జాతి వ్యతిరేకతని ప్రోత్సహిస్తున్నాడంటూ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది మొదటి భాగంలో ఇరువురు విద్యార్థుల కారణంగా రేగిన వివాదాలు విద్యార్థి ఉద్యమాలుగా మారి మోడీ ప్రభుత్వంపై ఆందోళనలు చే యగా…ఇప్పుడు ఉనా సంఘటనతో దళిత ఉద్యమం మునుపెన్నడూ లేని విధంగా ఉపందుకుంది. ఈ ఉద్యమం…గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ రాజీనామాకు సైతం దారితీసిన సంగతి తెలిసిందే.