ముంబయిలో రోడ్డుపై ఉమ్మితే... రూ. 200 జరిమానా!
ఇటీవల ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 737 రద్దీ ప్రాంతాల్లో ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రాంతాల్లో మార్షల్స్ని నియమించి పారిశుధ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. జులై ఒకటిన ప్రారంభమైన ఈ పథకం ప్రకారం… రోడ్డుమీద చెత్తచెదారం, ఉమ్మి వేసిన వారికి జరిమానా విధిస్తారు. అలా మొదటి నెలలోనే 30వేలమందికి జరిమానా విధించి 65 లక్షల రూపాయలు వసూలు చేశారు. మార్షల్స్ మొత్తం 83,308 మందిని ఈ విషయంలో హెచ్చరించారు. రైల్వేస్టేషన్లు, టూరిస్టులు ఎక్కువగా తిరిగే […]
ఇటీవల ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 737 రద్దీ ప్రాంతాల్లో ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్రాంతాల్లో మార్షల్స్ని నియమించి పారిశుధ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసింది. జులై ఒకటిన ప్రారంభమైన ఈ పథకం ప్రకారం… రోడ్డుమీద చెత్తచెదారం, ఉమ్మి వేసిన వారికి జరిమానా విధిస్తారు. అలా మొదటి నెలలోనే 30వేలమందికి జరిమానా విధించి 65 లక్షల రూపాయలు వసూలు చేశారు. మార్షల్స్ మొత్తం 83,308 మందిని ఈ విషయంలో హెచ్చరించారు. రైల్వేస్టేషన్లు, టూరిస్టులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలను ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు.
మార్షల్స్కి ప్రజలమీద చర్యలు తీసుకునే అధికారం లేదు…కేవలం వారినుండి జరిమానాని కట్టించుకోవాలి. అయితే జనం ఇందుకు వ్యతిరేకించినా, ఎదురు తిరిగినా వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకుని వెళ్లే అధికారం మాత్రం ఉంది. చాలా సందర్భాల్లో చాలా మంది… జరిమానా కట్టలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని హెచ్చరించి పంపేశారు. కొన్ని సందర్భాల్లో ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ఎలా జీవించాలి…అనే విషయంపై జనానికి అవగాహన కల్పించే చర్యలు తీసుకున్నారు.
ఈ స్కీముని ముంబయిలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపింపచేయాలని అనుకుంటున్నారు. రోడ్లమీద ఉమ్మివేయటం, చెత్తని పడేయటం చేసినవారికి 200 రూపాయలు, బహిరంగ మలవిసర్జన చేసినవారికి 100 రూ.లను జరిమానాగా విధించారు. రోడ్లపక్క బండ్లమీద వ్యాపారాలు చేసుకునే వారు చెత్తడబ్బాని అందుబాటులో ఉంచుకోకపోతే 500 రూ.లు, చెత్తని విడగొట్టే విధానాలు పాటించకపోతే వెయ్యి రూపాయలను జరిమానాగా విధించారు.
Click on Image to Read: