చెల్లెల్ని చంపి...రాత్రంతా శవం పక్కన నిద్రపోయాడు!
వాయువ్యఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన సొంతచెల్లిని ఆమె పదేళ్ల కొడుకుముందే చంపేశాడు. అంతేకాదు, రాత్రంతా శవం పక్కనే నిద్రపోయాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే– ప్రేము, మాధురి అన్నాచెల్లెళ్లు. మాధురి భర్తతో గొడవపడి అన్న ఇంటికి వచ్చింది. ఆమెకు పదేళ్ల కొడుకున్నాడు. అయితే అన్నా చెల్లెళ్లు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. ఈ గొడవలను భరించలేక ప్రేము భార్య ఇల్లువదిలి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి […]
వాయువ్యఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన సొంతచెల్లిని ఆమె పదేళ్ల కొడుకుముందే చంపేశాడు. అంతేకాదు, రాత్రంతా శవం పక్కనే నిద్రపోయాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే– ప్రేము, మాధురి అన్నాచెల్లెళ్లు. మాధురి భర్తతో గొడవపడి అన్న ఇంటికి వచ్చింది. ఆమెకు పదేళ్ల కొడుకున్నాడు. అయితే అన్నా చెల్లెళ్లు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. ఈ గొడవలను భరించలేక ప్రేము భార్య ఇల్లువదిలి వెళ్లిపోయింది.
ఇదిలా ఉండగా శనివారం రాత్రి ప్రేము మాధురిని దారుణంగా హతమార్చాడు. ఆమె కుమారుని ముందే ఈ ఘోరం జరిగింది. మాధురి గొంతుని రొట్టెల కర్రతో అదిమిపెట్టాడని, ఆమె గొంతు మీద కాలేసి తొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపాడని… మాధురి కొడుకు చెబుతున్న వివరాలను బట్టి తెలుస్తోంది. తెల్లవారాక ఆదివారం ఉదయం ఈ మొత్తం వివరాలను ఆ పిల్లవాడు పక్కింటివారికి చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ప్రేము పోలీసులు వచ్చేసరికి పారిపోయాడు. పోలీసులు అతడిని గాలించి వెంటనే పట్టుకున్నారు.
పోలీసులకు జరిగినదంతా వివరించిన మాధురి కొడుకు…ప్రేము రాత్రంతా తన తల్లి శవం పక్కనే నిద్రపోయాడని చెప్పాడు. అతడు తనని, తన తల్లిని తరచుగా కొట్టేవాడని కూడా చెప్పాడు. పోలీసులు ప్రేముని ప్రశ్నించగా…మాధురి మందులు వేసుకోకపోవటం వల్లనే అలా చేశానని చెప్పాడు. అయితే పోలీసుల విచారణలో ఆమెకు ఏ అనారోగ్యం లేదని, మందులేమీ వాడటం లేదని తేలింది. చివరికి ప్రేము తాను బాగా తాగేసి ఉన్నానని, ఏం చేశానో తేలియకుండానే చేశానని చెప్పాడు. ప్రేముపై పోలీసులు హత్యానేరం నమోదు చేశారు. క్రైమ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. మాధురి శరీరాన్ని పోస్ట్మార్టంకి పంపారు. ప్రేము మాధురిపై అత్యాచార ప్రయత్నం చేసిఉంటాడనే అనుమానాన్ని కొట్టిపారేయలేమని, ఆమె తీవ్రంగా వ్యతిరేకించడం కారణంగా హత్యకు గురయి ఉండవచ్చనే… కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.